AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రతి రోజు..!

Indian Railways: భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్ల (Trains)ను..

Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రతి రోజు..!
Indian Railway
Subhash Goud
|

Updated on: May 04, 2022 | 10:54 AM

Share

Indian Railways: భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్ల (Trains)ను నడుపుతుంటుంది. అసలే వేసవి కాలం.. అందుల పెళ్లిళ్ల సీజన్‌. ఇలాంటి సమయంలో ప్రయాణికుల రద్దీ భారీగా ఉంటుంది. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే శాఖ సదుపాయాలను కల్పిస్తోంది. కొన్ని రూట్లలో నడిచే వారంతాపు రైళ్లను ప్రతి రోజు నడిచేలా చర్యలు చేపడుతోంది రైల్వే శాఖ. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను కల్పించడంలో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక వేసవి సెలవులతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో రైళ్లలో కాలు పెట్టేందుకు కూడా చోటు లేని పరిస్థితి నెలకొంది. యూపీ-బీహార్ లోనే కాకుండా ఇతర రాష్ట్రాల రైళ్లలో కూడా కన్ఫర్మ్ సీటు పొందడం కష్టంగా మారింది. హౌరా, జయనగర్ మధ్య ప్రతిరోజు నడిచే వారానికో రైలును నడపాలని భారతీయ రైల్వే తూర్పు మధ్య రైల్వే నిర్ణయించింది. తూర్పు మధ్య రైల్వే ఈ నిర్ణయంతో ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడంలో సులభం కానుంది.

721 కిలోమీటర్ల ప్రయాణంలో 113 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, బీహార్‌లోని జయనగర్ మధ్య నడిచే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంతకు ముందు వారానికి ఒకసారి మాత్రమే నడిచేది. కానీ, ఈ మార్గంలో వేగంగా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, తూర్పు మధ్య రైల్వే ఇప్పుడు దీనిని ప్రతిరోజూ నడపాలని నిర్ణయించింది. ఈ రైలు హౌరా, జయనగర్ మధ్య మొత్తం 721 కి.మీ ప్రయాణించడానికి 25 గంటల సమయం పడుతుంది. అయితే హౌరా-జయనగర్ ఎక్స్‌ప్రెస్ 721 కిలోమీటర్ల ప్రయాణంలో 113 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

ఈ రైలులో 9 జనరల్ క్లాస్ కోచ్‌లతో సహా మొత్తం 11 కోచ్‌లు:

తూర్పు మధ్య రైల్వే తెలిపిన వివరాల ప్రకారం.. రైలు నంబర్- 13031, హౌరా-జయనగర్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు మే 3 నుండి ప్రతిరోజూ నడుస్తుంది. మరోవైపు, రైలు నంబర్ 13032, జైనగర్ నుండి హౌరా, జయనగర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌లు మే 4 నుండి ప్రతిరోజూ నడుస్తాయి. ఈ రైలులో 9 జనరల్ క్లాస్ కోచ్‌లు, SLR క్లాస్ 2 కోచ్‌లతో కలిపి మొత్తం 11 కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు టైమ్ టేబుల్, పూర్తి షెడ్యూల్ మునుపటిలాగే ఉంటుంది. హౌరా, జయనగర్ మధ్య నడుస్తున్న ఈ రైలు గరిష్ట వేగం 100 కిమీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Tata Group: టాటా గ్రూప్ కీలక నిర్ణయం.. మరో కంపెనీ కొనుగోలు.. రూ.12,100 కోట్లకు ఒప్పందం..!

Atal Pension Yojana: మీరు అటల్‌ పెన్షన్‌ అకౌంట్‌ తీయాలా..? బ్యాంకుకు వెళ్లకుండా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.. ఎలాగంటే..

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్