AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Overseas Bank: లాభాల బాటలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్.. తగ్గిన మొండి బకాయిలు

Indian Overseas Bank: ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నికర లాభం 20 శాతం పెరిగి రూ.392 కోట్లకు చేరుకుంది...

Indian Overseas Bank: లాభాల బాటలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్.. తగ్గిన మొండి బకాయిలు
Indian Overseas Bank
Subhash Goud
|

Updated on: Aug 07, 2022 | 9:10 AM

Share

Indian Overseas Bank: ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నికర లాభం 20 శాతం పెరిగి రూ.392 కోట్లకు చేరుకుంది. మొండి బకాయిలు తగ్గడం వల్ల బ్యాంకు లాభం పెరిగింది. ఏడాది క్రితం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.327 కోట్లుగా ఉందని బ్యాంక్ శనివారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. బ్యాంక్ మొత్తం ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.5,607 కోట్ల నుంచి రూ.5,028 కోట్లకు తగ్గింది.

వడ్డీ ఆదాయం పెరిగింది

బ్యాంకు కార్యకలాపాల లాభం కూడా గతేడాది రూ.1,202 కోట్ల నుంచి రూ.1,026 కోట్లకు తగ్గింది. అయితే బ్యాంకు వడ్డీ ఆదాయం గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.4,063 కోట్ల నుంచి రూ.4,435 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 2.53 శాతానికి పెరిగింది. గతేడాది ఇదే కాలంలో ఇది 2.34 శాతంగా ఉంది. బ్యాంక్ నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) నిష్పత్తి గత ఏడాది 11.48 శాతం నుంచి 9.03 శాతానికి తగ్గింది. అలాగే నికర ఎన్‌పీఏ కూడా 3.15 నుంచి 2.43 శాతానికి తగ్గింది. దీని కారణంగా మొండి బకాయిల కేటాయింపు కూడా రూ.1,010.15 కోట్ల నుంచి రూ.132.73 కోట్లకు తగ్గింది. మొండి బకాయిల కోసం ఆర్థిక కేటాయింపుల అవసరాన్ని తగ్గించడం వల్ల బ్యాంకు నికర లాభం పెరిగింది.

ఇవి కూడా చదవండి

SBI కూడా ఫలితాలు

ఇది కాకుండా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన త్రైమాసిక ఫలితాలను శనివారం విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో బ్యాంక్ రూ.6068 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది లాభం రూ.6504 కోట్లతో పోలిస్తే ఇది 6.7 శాతం తక్కువ. అయితే త్రైమాసికంలో, బ్యాంక్ ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. నికర వడ్డీ ఆదాయం పెరిగింది. మొత్తం ఆదాయం పడిపోవడంతో ఎస్‌బీఐ లాభంలో క్షీణత నమోదైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంకు లాభం గత ఏడాది రూ.7380 కోట్ల నుంచి రూ.7325 కోట్లకు తగ్గింది.

విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ త్రైమాసికంలో మొత్తం స్టాండలోన్ ఆదాయం గత ఏడాది రూ.77,347.17 కోట్ల నుంచి రూ.74,998.57 కోట్లకు తగ్గింది. అయితే నికర వడ్డీ ఆదాయం గతేడాది రూ.27,638 కోట్ల నుంచి రూ.31,196 కోట్లకు పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..