AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NPS Account: మిత్రమా.. ఈ ఖాతా డీయాక్టివేట్‌ అయ్యిందా? యాక్టివేట్‌ చేసుకోండిలా!

వరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఒక వ్యక్తి పెట్టుబడి పరిమితిని బట్టి అతని పెన్షన్ మొత్తం నిర్ణయించడం జరుగుతుంది. అందుకే అతనికి నెలవారీ పింఛను ఎంత కావాలి? ఎన్‌పీఎస్‌ని లెక్కించిన తర్వాతే అందులో పెట్టుబడి పెట్టాలి. ఒకప్పుడు ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన చాలా మంది వ్యక్తులు ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వారి ఖాతా డీయాక్టివేట్‌ అవుతుంది. అలాంటి సమయంలో ఎలాంటి టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. ఆ ఖాతాను మళ్లీ యాక్టివేట్‌ చేసుకోవచ్చు..

NPS Account: మిత్రమా.. ఈ ఖాతా డీయాక్టివేట్‌ అయ్యిందా? యాక్టివేట్‌ చేసుకోండిలా!
Nps
Subhash Goud
|

Updated on: Feb 18, 2024 | 8:25 AM

Share

ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నప్పుడు అతను దానితో పాటు పెన్షన్ స్కీమ్‌లో చేరడం ప్రారంభిస్తాడు. నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) అనే పథకం సాధారణ పౌరులకు గ్యారెంటీ పెన్షన్ ఉండేలా భారత ప్రభుత్వంచే అమలు చేయబడుతుంది. భారతీయులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఒక వ్యక్తి పెట్టుబడి పరిమితిని బట్టి అతని పెన్షన్ మొత్తం నిర్ణయించడం జరుగుతుంది. అందుకే అతనికి నెలవారీ పింఛను ఎంత కావాలి? ఎన్‌పీఎస్‌ని లెక్కించిన తర్వాతే అందులో పెట్టుబడి పెట్టాలి. ఒకప్పుడు ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన చాలా మంది వ్యక్తులు ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వారి ఖాతా డీయాక్టివేట్‌ అవుతుంది. అలాంటి సమయంలో ఎలాంటి టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. ఆ ఖాతాను మళ్లీ యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఏంటో చూద్దాం

జాతీయ పింఛను పథకానికి సభ్యత్వం పొందేందుకు ప్రతి ఒక్కరూ ఏటా కనీస మొత్తాన్ని అందించాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఎన్‌పిఎస్ టైర్-1 ఖాతాకు కనీసం రూ. 1,000 విరాళమివ్వడం తప్పనిసరి. ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాతాకు సహకారం అందించకపోతే ఎన్‌పీఎస్‌ ఖాతా నిష్క్రియమవుతుంది. ఎన్‌పీఎస్‌ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయడానికి మీరు ప్రతి సంవత్సరం రూ.100 జరిమానా చెల్లించాలి. ఇది కాకుండా ప్రతి సంవత్సరం కనీస సహకారం కూడా ఇవ్వాలి. ఎన్‌పీఎస్‌ ఖాతాను తిరిగి సక్రియం చేయడానికి పాయింట్-ఆఫ్-ప్రెజెన్స్ ఛార్జ్ కూడా చెల్లించాలి. టైర్-2 కోసం కనీస సహకారం అవసరం లేదు. కానీ టైర్-1 ఖాతా స్తంభింపజేస్తే, టైర్-2 కూడా స్వయంచాలకంగా స్తంభింపజేయబడుతుంది.

నియమాలు ఏమిటి?

ఇవి కూడా చదవండి

ఎన్‌పీఎస్‌ అనేది స్వచ్ఛంద పెన్షన్ ఫండ్. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాచే నియంత్రించబడుతుంది. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస సహకారంతో రూ. 6,000తో ప్రారంభించవచ్చు. ఎన్‌పీఎస్‌ అనేది ఒక రకమైన యాన్యుటీ ప్లాన్‌పై వార్షిక వడ్డీని అందుకుంటారు. సాధారణంగా, దీనిపై లభించే వడ్డీ రేటు 9 నుండి 11 శాతం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..