AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST: వాటర్ బాటిళ్లు, సైకిళ్లు, నోట్‌బుక్‌, బీమాలపై తగ్గనున్న ధరలు!

లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్‌తో సహా ఇతర సమస్యలపై నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రుల బృందం శనివారం సమావేశమైంది. సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులకు రూ.5 లక్షల వరకు కవరేజీతో కూడిన ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంలపై జీఎస్టీని మినహాయించాలని..

GST: వాటర్ బాటిళ్లు, సైకిళ్లు, నోట్‌బుక్‌, బీమాలపై తగ్గనున్న ధరలు!
Subhash Goud
|

Updated on: Oct 19, 2024 | 7:31 PM

Share

సీనియర్ సిటిజన్లు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియంలను పన్ను రహితంగా పొందవచ్చు. జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన జీఓఎం ఈ మేరకు సిఫారసు చేసింది. దీనితో పాటు 20 లీటర్ల వాటర్ బాటిళ్లు, సైకిళ్లు, ప్రాక్టీస్ నోట్‌బుక్‌లపై పన్ను రేటును ఐదు శాతానికి తగ్గించాలని గోమ్ నిర్ణయించింది. అదే సమయంలో ఖరీదైన రిస్ట్ వాచీలు, షూలపై కూడా పన్ను పెంచాలని సూచించారు. అయితే ఈ విషయంలో జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది.

20 లీటర్లు, అంతకంటే ఎక్కువ నీటి బాటిళ్లపై జీఎస్టీని 18 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలని GoM (Group of Ministers) సూచించింది. ఇది కాకుండా, ప్రాక్టీస్ నోట్‌బుక్‌లపై జీఎస్‌టిని 12 శాతం నుండి ఐదు శాతానికి తగ్గించాలని కూడా సిఫార్సు చేసింది. అదే విధంగా రూ.10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లపై జీఎస్టీని 12 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలని సూచించింది. రూ.15,000 కంటే ఎక్కువ ధర ఉన్న షూలు, రూ. 25,000 కంటే ఎక్కువ ఉన్న రిస్ట్ వాచీలపై జీఎస్టీని 18 శాతం నుంచి 28 శాతానికి పెంచాలని కూడా GoM సూచించింది.

ఇది కూడా చదవండి: Pigeons: బాల్కనీ, కిటకీల వద్ద పావురాలతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే అస్సలు రావు

ఇవి కూడా చదవండి

లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్‌తో సహా ఇతర సమస్యలపై నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రుల బృందం శనివారం సమావేశమైంది. సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులకు రూ.5 లక్షల వరకు కవరేజీతో కూడిన ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంలపై జీఎస్టీని మినహాయించాలని సమావేశంలో నిర్ణయించారు. అదే సమయంలో, రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆరోగ్య బీమా కవరేజీకి చెల్లించే ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ విధింపు కొనసాగుతుంది. ప్రస్తుతం టర్మ్ పాలసీలు, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలకు చెల్లించే జీవిత బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు.

జీఎస్టీ కౌన్సిల్ గత నెలలో జరిగిన సమావేశంలో ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై పన్నును నిర్ణయించడానికి 13 మంది సభ్యుల మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంత్రుల బృందం కన్వీనర్‌గా సామ్రాట్ చౌదరి ఉన్నారు. ఇందులో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, మేఘాలయ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ మంత్రులు ఉన్నారు. అక్టోబర్ నెలాఖరులోగా తన నివేదికను కౌన్సిల్‌కు సమర్పించనున్నారు.

ఇది కూడా చదవండి: Ratan Tata: దేశం టాటాకు సెల్యూట్ చేసిన వేళ.. ఈ డీల్‌కు మంచి గుర్తింపు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి