AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Obesity: ఫోన్‌ల వల్ల పిల్లలకు ఎలాంటి సమస్యలో తెలుసా? అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు!

అధిక మొబైల్ వాడకం అనేది పిల్లల అభివృద్ధిపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపుతుందని ఏఎం మెడికల్‌ సెంటర్‌ పీడియాట్రిషియన్ జయతి సేన్‌గుప్తా చెబుతున్నారు. మొబైల్ ద్వారా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఎక్కువ కాలం మొబైల్‌ చూడటం ప్రతికూల..

Child Obesity: ఫోన్‌ల వల్ల పిల్లలకు ఎలాంటి సమస్యలో తెలుసా? అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు!
Subhash Goud
|

Updated on: Oct 19, 2024 | 5:06 PM

Share

నేటి పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తే చాలు ఇంకేమీ అక్కర్లేదు. రోజంతా కార్టూన్‌ వీడియోలు, గేమ్స్‌తోనే గడిపేస్తుంటారు. తల్లితండ్రులు తమ పనులు చేసుకునేందుకు చిన్నప్పటి నుంచి పిల్లలకు మొబైళ్లను అలవాటు చేస్తున్నారు. దీంతో పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌ అనేది ఒక వ్యసనంగా మారిపోయింది. అయితే పిల్లలు పదేపదే ఫోన్‌ వాడటం వల్ల మంచికంటే చెడు ఎక్కువ జరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. స్క్రీన్ టైం పెరగడంతోపాటు ఊబకాయంతో బాధపడే పిల్లల సంఖ్య కూడా పెరుగుతోందని పరిశోధనలు చెబుతున్నాయి. యువతలో ఊబకాయం సమస్య చాలా ఎక్కువగా ఉంది. రోజంతా మొబైల్ ఫోన్లు చూడటం వల్ల క్రీడల్లోనూ విముఖత కనిపిస్తోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మొబైల్‌ స్క్రీన్‌ ఎక్కువ సేపు చూడటం వల్ల పిల్లలకు ప్రమాదమేనంటున్నారు నిపుణులు. ఆడుకునే సమయం ఫోన్‌లకు బానిస కావడం వల్ల పిల్లల శారీరక శ్రమ తగ్గుతోంది. ఫలితంగా, అదనపు శరీర కొవ్వును తొలగించడం సాధ్యం కాదు. అది శరీరంలోనే ఉంటుంది. బరువు పెరగడానికి కారణమవుతుంది. స్థూలకాయం వంటి వ్యాధుల బారిన పడకుండా పిల్లలను దూరం చేయాలంటే కనీసం 60 నిమిషాల పాటు క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు.

అధిక మొబైల్ వాడకం అనేది పిల్లల అభివృద్ధిపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపుతుందని ఏఎం మెడికల్‌ సెంటర్‌ పీడియాట్రిషియన్ జయతి సేన్‌గుప్తా చెబుతున్నారు. మొబైల్ ద్వారా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఎక్కువ కాలం మొబైల్‌ చూడటం ప్రతికూల ప్రభావాలు సానుకూలతలను అధిగమిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. మీరు ఒక రోజులో మొబైల్ ఫోన్ ముందు గడిపే సమయం మీ పనితీరు, మానసిక స్థితి లేదా అభ్యాసంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది పిల్లల భాషా అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుందంటున్నారు.

టీవీ లేదా మొబైల్ స్క్రీన్‌ల ముందు ఎక్కువ సమయం గడిపే తల్లిదండ్రులు వారి పిల్లలకు అదే అలవాటు చేసేస్తున్నారని అధ్యయనం గుర్తించింది.. ఈ అలవాటు తర్వాత ఊబకాయం, నిద్ర సమస్యలు, నిరాశ, ఆందోళనకు దారితీస్తుంది.

గత 3 దశాబ్దాలలో యునైటెడ్ స్టేట్స్‌లో ఊబకాయం పిల్లలు కౌమారదశలో దాదాపు మూడు రెట్లు పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్‌లో పిల్లలలో ఊబకాయం రేటు దాదాపు 17 శాతం. ముఖ్యంగా టీవీ చూడటం వల్ల పిల్లలు అధిక బరువు, స్థూలకాయులుగా మారే ప్రమాదం రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలను మొబైల్‌, టీవీలకు అతుక్కుపోకుండా చూడాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి