AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Council: ఈ నెల 28, 29 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. పన్ను స్లాబ్‌లు తగ్గించే అవకాశం..

జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం ఈ నెల 28, 29 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరగనుంది. అంతకు ముందు అంటే శుక్రవారం మంత్రుల బృందం కీలక సమావేశం జరిగింది...

GST Council: ఈ నెల 28, 29 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. పన్ను స్లాబ్‌లు తగ్గించే అవకాశం..
Srinivas Chekkilla
|

Updated on: Jun 18, 2022 | 6:32 AM

Share

జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం ఈ నెల 28, 29 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరగనుంది. అంతకు ముందు అంటే శుక్రవారం మంత్రుల బృందం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వడ్డీరేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. CNBC ఆవాజ్ నివేదిక ప్రకారం, మంత్రుల బృందం సమావేశంలో పన్ను స్లాబ్‌లలో మార్పుకు సంబంధించి తుది అభిప్రాయం రాలేదు. ఈ అంశంపై పునరాలోచించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మంత్రులు పాల్గొన్నారు. కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల చివరి వారంలో జరగనున్న కౌన్సిల్‌ సమావేశంలో కీలక నిర్ణయాలకు రానున్నారు. నేటి సమావేశంలో రాష్ట్రాలకు వచ్చే ఆదాయ నష్టాన్ని 5 సంవత్సరాలకు పైగా కొనసాగించాలని డిమాండ్ కూడా చేశారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 1 జూలై 2017న దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఐదేళ్లపాటు రాష్ట్రాలకు వచ్చే ఆదాయ నష్టాన్ని భర్తీ చేస్తామని ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చింది. కరోనా కారణంగా మొత్తం పరిస్థితి మరింత దిగజారింది.

ఈరోజు జరిగిన సమావేశంలో మూడు ప్రధాన అంశాలను పరిశీలించారు. రానున్న రోజుల్లో జీఎస్టీ నిర్మాణం ఎలా ఉంటుందనేది మొదటి అంశం. ప్రస్తుతం, మినహాయింపు కేటగిరీ కిందకు వచ్చే ఉత్పత్తులు డజన్ల కొద్దీ ఉన్నాయి. ఈ ఉత్పత్తులపై ఎలాంటి పన్ను ఉండదు. ఈ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలా వద్దా అనేది కూడా ఈ అంశంలో పరిశీలిస్తారు. మూడో ప్రతిపాదన జీఎస్టీ శ్లాబ్‌ల విలీనానికి సంబంధించినవిగా ఉన్నాయి. ప్రస్తుతం జీఎస్టీలో నాలుగు శ్లాబులు ఉన్నాయి. మొదట 5 శాతం తర్వాత 12 శాతం, 18 శాతం, 28 శాతం. 12 శాతం, 18 శాతం ఉన్న శ్లాబులను ఈ మధ్య 15-16 శాతానికి విలీనం చేయాలనే చర్చ కూడా గతంలో చర్చకు వచ్చింది. వీటిలో ఎక్కువ భాగం ఆహార పదార్థాలు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వాటిపై పన్ను విధిస్తే ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం మరింత బలపడుతుందని చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, GST కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు, మంత్రుల బృందం కౌన్సిల్ నుంచి అదనపు సమయాన్ని కోరే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని వాస్తవాలను పరిశీలిస్తున్నారు.

Follow Us
36 ఏళ్లపాటు సుల్తాన్‌.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు
36 ఏళ్లపాటు సుల్తాన్‌.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?