AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tax Collections: కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 31 శాతం పెరుగుదల

కేంద్ర ప్రభుత్వ మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో విపరీతమైన పెరుగుదల నమోదైంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 10 నవంబర్ 2022 వరకు గణాంకాల..

Tax Collections: కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 31 శాతం పెరుగుదల
Tax Collections
Subhash Goud
|

Updated on: Nov 12, 2022 | 2:10 PM

Share

కేంద్ర ప్రభుత్వ మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో విపరీతమైన పెరుగుదల నమోదైంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 10 నవంబర్ 2022 వరకు గణాంకాలను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 31 శాతం పెరుగుదల ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 10 వరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 31 శాతం పెరిగి రూ.10.54 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

వ్యక్తిగత ఆదాయపు పన్నులో మెరుగైన పనితీరు ఈ వృద్ధికి దోహదపడిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. రీఫండ్‌ల సర్దుబాటు తర్వాత నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.8.71 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయపు పన్ను ఉంటుంది. సాధారణ బడ్జెట్‌లో ఏడాది మొత్తానికి నిర్దేశించిన లక్ష్యంలో ఇది 61.31 శాతం.

ఇవి కూడా చదవండి

స్థూల వసూళ్లు రూ.10.54 లక్షల కోట్లు:

ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 మధ్య కాలంలో రూ.1.83 లక్షల కోట్ల విలువైన రీఫండ్‌లు జారీ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నవంబర్ 10 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థూల వసూళ్లు రూ.10.54 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో స్థూల వసూళ్లతో పోలిస్తే ఇది 30.69 శాతం ఎక్కువ. స్థూల కార్పొరేట్ పన్ను, వ్యక్తిగత ఆదాయపు పన్ను (పిఐటి) వసూళ్లు వరుసగా 22.03 శాతం, 40.64 శాతం పెరిగాయి.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి