Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ మూడు ప్రభుత్వ కంపెనీల్లోని వాటాల విక్రయానికి గ్రీన్‌ సిగ్నల్‌

ఎట్టకేలకు మూడు ప్రభుత్వ కంపెనీల్లో వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల..

కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ మూడు ప్రభుత్వ కంపెనీల్లోని వాటాల విక్రయానికి గ్రీన్‌ సిగ్నల్‌
Public Sector Companies
Follow us
Subhash Goud

|

Updated on: Nov 11, 2022 | 1:24 PM

ఎట్టకేలకు మూడు ప్రభుత్వ కంపెనీల్లో వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ విధానం కొనసాగుతుందనడానికి ఇవి స్పష్టమైన సంకేతాలు. ఈ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో షేర్ల విక్రయం ప్రయోగాన్ని అమలు చేయనున్నారు. ఈ మూడు పెద్ద ప్రభుత్వ కంపెనీలను మార్చి, 2023 నాటికి ఉపసంహరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ కంపెనీల్లో ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్) ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఐదు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

ప్రభుత్వ నివేదికల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా, హిందుస్థాన్ జింక్, రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (ఆర్‌ఐటీఈఎస్‌) షేర్లను విక్రయించడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ స్థాయిలో ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ప్రతిపాదనకు సంబంధించి కంపెనీ రెగ్యులేటర్ నుండి ఇంకా ఆమోదం రాలేదు. ఈ ఆమోదం లభించిన తర్వాత తదుపరి అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65,000 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విక్రయం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.24,000 కోట్లు వసూలు చేసింది.

ఇప్పుడు, కొత్త ప్రతిపాదన ప్రకారం ప్రభుత్వం రాబోయే ఐదు నెలల్లో మూడు ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలను విక్రయించడం ద్వారా మరిన్ని నిధులను సమీకరించనుంది. దీని ద్వారా రూ.18,000 నుంచి 20,000 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కోల్ ఇండియాలో ప్రభుత్వం 3 శాతం వాటాను విక్రయించనుంది. 5,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హిందుస్థాన్ జింక్‌లో 8% వాటాను విక్రయించడం ద్వారా రూ. 10,000 కోట్లు, ఆర్‌ఐటీఈఎస్‌ లో 10% వాటాలను విక్రయించడం ద్వారా రూ. 1,000 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి