AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం లగ్జరీ కార్లపై జీఎస్టీని తగ్గించనుందా?

మోడీ ప్రభుత్వానికి ఇది మధ్యంత బడ్జె్‌ట్‌. ఆ తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. తర్వాత వచ్చే ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. అయితే ఈ బడ్జెట్‌పై వివిధ రంగాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఆటో రంగంలో ఉన్న కంపెనీల ప్రకారం.. మధ్యంతర బడ్జెట్‌లో గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించే విధానాలను ప్రభుత్వం..

Budget 2024: ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం లగ్జరీ కార్లపై జీఎస్టీని తగ్గించనుందా?
Gst
Subhash Goud
|

Updated on: Jan 28, 2024 | 4:09 PM

Share

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ ప్రభుత్వానికి ఇది మధ్యంత బడ్జె్‌ట్‌. ఆ తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. తర్వాత వచ్చే ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. అయితే ఈ బడ్జెట్‌పై వివిధ రంగాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఆటో రంగంలో ఉన్న కంపెనీల ప్రకారం.. మధ్యంతర బడ్జెట్‌లో గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించే విధానాలను ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్‌ ఉంది. ఇది కాకుండా, మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధి వేగాన్ని కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంది.

జీఎస్టీని తగ్గించడంపై దృష్టి పెట్టాలి

Mercedes-Benz India ఎండీ, ఈసీవో సంతోష్ అయ్యర్ ప్రకారం.. అతను మౌలిక సదుపాయాల రంగంలో ప్రాజెక్ట్‌లపై మూలధన వ్యయం కొనసాగుతుందని ఆశిస్తున్నారు. గ్రీన్ మొబిలిటీ కోసం పాలసీ ప్రోత్సాహకాలపై ప్రభుత్వం దృష్టి సారించడం కొనసాగించాలి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరగడానికి ఇది దోహదపడుతుంది. దేశ జిడిపికి లగ్జరీ కార్ల పరిశ్రమ గణనీయంగా దోహదపడుతుందని అయ్యర్ అన్నారు.

ఇవి కూడా చదవండి

డ్యూటీ స్ట్రక్చర్, జీఎస్టీని ప్రాధాన్యతా ప్రాతిపదికన సంస్కరించాలని ఆటో రంగం కోరుతోంది. తదుపరి బడ్జెట్‌లో ఎలాంటి ఆశ్చర్యకరమైనవి ఆశించడం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం లగ్జరీ కార్లపై 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అంతేకాకుండా సెడాన్‌లపై 20 శాతం, ఎస్‌యూవీలపై 22 శాతం అదనపు సెస్‌ విధిస్తారు. ఈ వాహనాలపై మొత్తం పన్ను దాదాపు 50 శాతం ఉంటుంది.

ఎకానమీ, ఆటో సెక్టార్

టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ ఎండి స్వప్నేష్ ఆర్ మారు మాట్లాడుతూ, భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ, రవాణా రంగాన్ని మార్చడానికి ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని వాహన తయారీదారులు విశ్వసిస్తున్నారని అన్నారు. జేకే టైర్ అండ్‌ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ రఘుపతి సింఘానియా మాట్లాడుతూ ఆటో రంగానికి స్థిరమైన విధానాలు ఈ రంగం విస్తరణకు దారితీస్తాయని అన్నారు.

బడ్జెట్‌లో ఈ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాం:

మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ ఎండీ, సీఈవో సుమన్ మిశ్రా మాట్లాడుతూ.. సమిష్టి ఆదాయం, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, వాణిజ్య వాహనాల ద్వారా ప్రజలు ఆర్థికంగా సాధికారత పొందుతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా పథకం ద్వారా బడ్జెట్‌లో ఈ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని మేము భావిస్తున్నాము అని అన్నారు.

పిహెచ్‌ఎఫ్ లీజింగ్ లిమిటెడ్ సిఇఒ శల్య గుప్తా మాట్లాడుతూ 2070 నాటికి నికర జీరో ఉద్గారాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకే తేలికపాటి వాణిజ్య విద్యుత్ వాహనాలు (ELCV) ఉపాధిని అందించడమే కాకుండా తక్కువ ఉద్గార పరిష్కారం పాత్రను పోషిస్తున్నాయి. ప్రభుత్వం ELCVలపై సబ్సిడీ మద్దతును కొనసాగించడమే కాకుండా వాటి నమోదు ప్రక్రియను కూడా సులభతరం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us