Gold Silver Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో

కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా.. పసిడి, వెండి ధరలు పెరిగాయి. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.48,100 ఉంది.

Gold Silver Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో
Gold And Silver
Follow us

|

Updated on: Jun 04, 2022 | 6:30 AM

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటుంటాయన్న విషయం తెలిసిందే. ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. అయితే.. కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా.. పసిడి, వెండి ధరలు పెరిగాయి. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.48,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.500, 24 క్యారెట్లపై రూ.540 మేర పెరిగింది. దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.1300 మేర పెరిగి.. రూ.62,700 లుగా ఉంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,470 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200, 24 క్యారెట్ల ధర రూ.52,580 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,580 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,580గా ఉంది.

ఇవి కూడా చదవండి

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,470 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,470 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,700 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.62,700 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.68,500 ఉంది. బెంగళూరులో రూ.68,500, కేరళలో రూ.68,500 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,500, విజయవాడలో రూ.68,500, విశాఖపట్నంలో రూ.68,500 లుగా కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..