Gold Silver Price Today: దూసుకుపోతున్న బంగారం.. భారీగా పెరిగిన వెండి ధర

Gold Silver Price Today: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాలు ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వివిధ ధరలపై ప్రభావం చూపుతోంది. ఇక బంగారం విషయానికొస్తే భారతీయులు (Indians) పసిడికి..

Gold Silver Price Today: దూసుకుపోతున్న బంగారం.. భారీగా పెరిగిన వెండి ధర
Follow us

|

Updated on: Mar 14, 2022 | 6:32 AM

Gold Silver Price Today: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాలు ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వివిధ ధరలపై ప్రభావం చూపుతోంది. ఇక బంగారం విషయానికొస్తే భారతీయులు (Indians) పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. ప్రస్తుతం దేశంలో బంగారం (Gold) ధరలు దూసుకుపోతున్నాయి. తాజాగా సోమవారం (మార్చి14)న దేశంలో బంగారం, వెండి (Silver Rate) ధరలు భారీగా పెరిగాయి. ఇక దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 400లకుపైగా పెరుగగా, కిలో వెండి ధరపై ఏకంగా రూ.4,400 వరకు ఎగబాకింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,410 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,810, ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,400 ఉంది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,810 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,810 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,810 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,810, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..48,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,810 ఉంది.

వెండి ధరలు

వెండి ధరల విషయానికొస్తే దేశీయంగా కిలో బంగారం ధరపై రూ.4,400 వరకు ఎగబాకింది. తాజాగా ఢిల్లీలో కిలో బంగారం ధర రూ.70,300 ఉండగా, ముంబైలో రూ.74,700 ఉంది. ఇక చెన్నైలో కిలో బంగారం ధర రూ.74,700 ఉండగా, కోల్‌కతాలో రూ.70,300 ఉంది. బెంగళూరులో కిలో బంగారం ధర రూ.74,700 ఉండగా, కేరళలో రూ.74,700 ఉంది. హైదరాబాద్‌లో కిలో బంగారం ధర రూ.74,700 ఉండగా, విజయవాడలో రూ.74,700 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

PAN-Aadhaar: ఈ నెలాఖరులోగా ఈ పని చేయకుంటే పొరపాటు చేసినట్లే.. రూ.10 వేల జరిమానా

Indian Railway: ప్రయాణికుల కోసం ఇండియన్‌ రైల్వే కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత ఆదాయం