Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్ల వివరాలివే
మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,000కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,280గా ఉంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తూ రూ.100 మేర పెరిగింది.

పసిడి ప్రియులకు షాక్. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ(అక్టోబర్27) మళ్లీ పెరిగాయి. బుధవారం ధరలతో పోలిస్తే 10 గ్రాముల బంగారం రూ.150 నుంచి రూ.170 వరకు పెరిగింది. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,000కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,280గా ఉంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తూ రూ.100 మేర పెరిగింది. కొత్త ధరలతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 58,100 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 ఉంది.
☛ హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద కొనసాగుతోంది.




☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 280 ఉంది.
☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద ఉంది.
☛ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 పలుకుతోంది.
☛ కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది.
☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 ఉంది.
☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది.
వెండి ధరలిలా..
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,100 ఉండగా, హైదరాబాద్లో ధర రూ.63,200 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.63,200 ఉండగా, చెన్నైలో కూడా ఇదే ధర పలుకుతోంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.57,700 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.58, 100 ఉంది. ఇక కేరళలో రూ.64,500 వద్ద కొనసాగుతోంది. కాగా, దేశంలోని ఇతర నగరాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం రేట్లలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చునని గమనించాలి.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..




