Gold Price: లక్ష దాటిన బంగారం ధర! కొందరికి గుడ్ న్యూస్, ఇంకొందరికి బ్యాడ్ న్యూస్! ఎలాగంటే..?
తాజాగా బంగారం ధరలు లక్ష రూపాయలను దాటాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.10,004కి చేరింది. పెళ్ళిళ్లు, ఇతర శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయాల్సిన వారు ఆందోళన చెందుతున్నారు. అయితే, పెట్టుబడిదారులు మాత్రం ఈ పెరుగుదలతో సంతోషంగా ఉన్నారు. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

బంగారం ధర పెరుగు ఆపాడం లేదు. కొంతకాలంగా విపరీతంగా పెరుగుతున్న పసిడి ధర తాజాగా లక్ష రుపాయాలు దాటేసింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకు రూ.10,004గా ఉంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రూ.9170, ఇక 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.7,503గా ఉంది. ఇంత భారీగా ధర పెరుగుతుండటం చూసి కొనుగోలుదారులు భయపడుతున్నారు. ఇంతలా బంగారం ధర పెరుగుతూ పోతుంటే.. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనేది ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తు కాలంలో మరింత ధర పెరిగే అవకాశం ఉందని కూడా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే.. బంగారం ధర ఇంతలా పెరుగుతుంటే కొంతమంది బాధపడుతుండగా, మరికొంతమంది సంతోష పడుతున్నారు. బాధపడుతున్న వారిలో త్వరలో బంగారం కొనాలి అనుకునే వారు ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్ల తల్లిదండ్రులు త్వరలోనే అమ్మాయి పెళ్లి పెట్టుకోవాలి అనుకునేవాళ్లు ఈ ధరల పెరుగుదల చూసి భయపడుతున్నారు. ఇక సంతోష పడేవారిలో పెట్టుబడిదారులు ఉన్నారు. బంగారాన్ని పెట్టుబడి మార్గంగా చూసే వారు, ఇప్పటికే నాన్ ఫిజికల్ గోల్డ్లో పెట్టుబడి పెట్టిన వారు ఈ ధరల పెరుగుదలతో సంతోషంగానే ఉన్నారు. అలాగే బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలి అనుకుంటున్న వారు ప్రస్తుత బంగారం ధరతో తమ వద్ద ఉన్న బంగారానికి కాస్త ఎక్కువగానే లోన్ వస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




