Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold And Silver Price Today: పండగ వేళ పసిడి ధర పైపైకి.. అదే బాటలో పయనిస్తున్న వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే

బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. డాలర్ మరింతగా బలపడడంతో రోజు రోజుకీ పసిడి, వెండి ధరలు పైపైకి వెళ్తున్నాయి.

Gold And Silver Price Today: పండగ వేళ పసిడి ధర పైపైకి.. అదే బాటలో పయనిస్తున్న వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే
Gold And Silver Today
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Oct 07, 2022 | 11:40 AM

భారతీయులకు పసిడికి మంచి రిలేషన్ షిప్ ఉంది.  ఎప్పుడైనా అనుకోని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే తమని బంగారం ఆదుకుంటుందని భావిస్తారు. అయితే ఇప్పుడు బంగారం పై పెట్టుబడులను కూడా పెడుతున్నారు. బంగారం తర్వాత వెండిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా వివాహాదిశుభకార్యాలలో బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో ఆర్ధిక పరిస్థితిలకు అనుగుణంగా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. నేడు (అక్టోబర్ 6వ తేదీ 2022) గురువారం బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా..  దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం..

బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. డాలర్ మరింతగా బలపడడంతో రోజు రోజుకీ పసిడి, వెండి ధరలు పైపైకి వెళ్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర: 

  1. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.400పెరిగి  రూ.47,750లకు చేరుకుంది.  24 క్యారెట్ల బంగారం రూ. 440 లు పెరిగి.. ధర రూ. .51,660లకు చేరుకుంది.
  2. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ కూడా కొనసాగుతున్నాయి.

వివిధ నగరాలలో బంగారం ధరలు:

  1. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.400లు పెరిగి  రూ.47,500లకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 లు పెరిగి  రూ. 51,820లకు చేరుకుంది.
  2. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750గా ఉంది. ప్యూర్ గోల్డ్  24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100లకు చేరుకుంది.  ఉంది.
  3. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో కంటే చెన్నైలో పసిడి ధరలు మరింత అధికంగా ఉన్నాయి. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉంది.

దేశంలో వెండి ధరలు: 

దేశీయంగా పసిడి ధరల బాటలో వెండి కూడా నడుస్తోంది. మన దేశంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలు వంటి సమయంలో వెండి వస్తువుల ఖరీదుకి ఆసక్తిని చూపిస్తారు. దసరా పర్వదినం సందర్భంగా వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి మరింత ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా వెండి ధర పరుగులు పెడుతూనే ఉంది.

హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ, వరంగల్ నగరాల్లో నేడు వెండి ధర నేడు కిలోకు రూ.300 పెరిగింది. కిలో రూ.67,000 లకు చేరుకుంది.

Note: పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS వంటివి కలిపిన ధరలు కావు.. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పసిడి వెండి ధరలు.. ఈ రొజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెక్చుతగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి కూడా ఏర్పడవచ్చు. కొనుగోలు దారులు ఈ విషయాన్నీ గమనించాల్సి ఉంటుంది.