Amul Milk Price: అమూల్ పాల ధర మళ్లీ పెరగనుందా..? క్లారిటీ ఇచ్చిన కంపెనీ
దేశంలో పాల ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడు సైతం ప్రతి రోజు వినియోగించే పాల ధరను పెంచుతుండటంతో మరింత భారంగా మారుతోంది. ఇటీవల మదర్ డైరీ పాల ధరపెరిగిన విషయం..
దేశంలో పాల ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడు సైతం ప్రతి రోజు వినియోగించే పాల ధరను పెంచుతుండటంతో మరింత భారంగా మారుతోంది. ఇటీవల మదర్ డైరీ పాల ధరపెరిగిన విషయం తెలిసిందే. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎఎఫ్), అమూల్ బ్రాండ్తో పాలను వ్యాపారం చేసే సహకార సంస్థ సమీప భవిష్యత్తులో దేశంలో పాల ధరలను పెంచే ఆలోచన లేదని ప్రధానంగా గుజరాత్, ఢిల్లీ-NCR, పశ్చిమ బెంగాల్ మరియు ముంబై మార్కెట్లలో పాలను విక్రయిస్తుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి తెలిపారు. ఈ సహకార సంస్థ రోజుకు 150 లక్షల లీటర్ల కంటే ఎక్కువ పాలను విక్రయిస్తుందని, అందులో దాదాపు 40 లక్షల లీటర్ల పాలను ఢిల్లీ-ఎన్సిఆర్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు.
ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ-ఎన్సిఆర్ మార్కెట్లో మదర్ డెయిరీ ఫుల్క్రీమ్ పాల ధరలను లీటరుకు 1 రూపాయలు, టోకెన్ మిల్క్ ధరలను లీటరుకు 2 రూపాయల చొప్పున పెంచింది. మదర్ డెయిరీ పాల ధరలను పెంచిన తర్వాత జీసీఎంఎంఎఫ్ పాల ధరలను పెంచే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగినప్పుడు… పాల ధరలను పెంచే ఆలోచన లేదని సోధి చెప్పారు. గత అక్టోబరులో ధర పెరిగినప్పటి నుండి ఖర్చు పెద్దగా పెరగలేదని ఆయన అన్నారు.
అక్టోబర్లో ధరలు పెంచారు
అక్టోబరులోఅముల్ గోల్డ్ (పూర్తి క్రీమ్), గేదె పాల ధరలను లీటరుకు 2 రూపాయలు పెంచింది. ఎన్నికల నేపథ్యంలో గుజరాత్లో మినహా మిగిలిన అన్ని మార్కెట్లలో ఈ ధర పెరిగింది. డిసెంబర్ తొలివారంలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ధరల పెరుగుదల తర్వాత అమూల్ గోల్డ్ ధర లీటరుకు రూ.61 నుండి రూ.63కి పెరగగా, గేదె పాల ధర లీటరుకు రూ.63 నుండి రూ.65కి పెరిగింది.
ఏడాది అమూల్ పాల ధరలను మూడు సార్లు పెంచగా, మదర్ డెయిరీ నాలుగు సార్లు పెంచింది. రోజుకు 30 లక్షల లీటర్లకు పైగా అమ్మకాల పరిమాణంతో ఢిల్లీ-ఎన్సిఆర్లో మదర్ డెయిరీ ప్రముఖ పాల సరఫరాదారులలో ఒకటి. ఆహార ద్రవ్యోల్బణం ఇప్పటికే అధిక స్థాయిలో ఉన్న తరుణంలో పాల ధరల పెంపు కుటుంబ బడ్జెట్పై ప్రభావం చూపింది. పాడి రైతుల నుంచి ముడి పాలను కొనుగోలు చేసే ఖర్చు పెరగడమే ధరల పెంపునకు కారణమని మదర్ డెయిరీ పేర్కొంది.
21 మిలియన్ టన్నులు ఉత్పత్తి:
ఈ సంవత్సరం మొత్తం పాడి పరిశ్రమలో పాల డిమాండ్, సరఫరాలో భారీ అంతరం కనిపిస్తోందని కంపెనీ తెలిపింది. పశువుల దాణా ధరలు పెరగడం వల్ల పచ్చి పాల లభ్యతపై ప్రభావం పడిందని, రుతుపవనాల కారణంగా ముడి పాల ధరలు ఒత్తిడికి గురవుతున్నాయని కంపెనీ పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశంలో పాల ఉత్పత్తి సంవత్సరానికి 210 మిలియన్ టన్నులు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి