AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fuel Prices: పెట్రోల్‌పై లీటరుకు రూ. 20, డీజిల్‌పై లీటరుకు రూ. 100 నష్టం..!

Fuel Prices: ఒకవైపు, ప్రపంచ అనిశ్చితి నడుమ పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా ప్రభుత్వం వినియోగదారులను కాపాడుతోంది. దీనివల్ల ఇంధన రిటైలర్లు నష్టాలను చవిచూస్తున్నారు. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. పశ్చిమ ఆసియా సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగి, అంతర్జాతీయ..

Fuel Prices: పెట్రోల్‌పై లీటరుకు రూ. 20, డీజిల్‌పై లీటరుకు రూ. 100 నష్టం..!
Petrol, Diesel Prices
Subhash Goud
|

Updated on: Apr 25, 2026 | 9:53 AM

Share

Fuel Prices: ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. ప్రపంచ ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా, అనేక దేశాలు ఇప్పటికే పెరిగిన ఖర్చులను వినియోగదారులపై మోపాయి.

ఇదిలా ఉండగా, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ చిల్లర ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. దీని ఫలితంగా ఇంధన వ్యాపారులు గణనీయమైన నష్టాలను చవిచూస్తున్నారట. వీరు పెట్రోల్‌పై లీటరుకు రూ.20, డీజిల్‌పై లీటరుకు రూ.100 నష్టపోతున్నట్లు చెబుతున్నారు.

నష్టాల్లో నడుస్తున్న రిఫైనరీలు

ఒకవైపు, ప్రపంచ అనిశ్చితి నడుమ పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా ప్రభుత్వం వినియోగదారులను కాపాడుతోంది. దీనివల్ల ఇంధన రిటైలర్లు నష్టాలను చవిచూస్తున్నారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?

హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. పశ్చిమ ఆసియా సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగి, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు 70-80 డాలర్ల వద్ద స్థిరంగా ఉంటే, చమురు శుద్ధి కంపెనీలు అటువంటి హెచ్చుతగ్గులను తట్టుకోవడం కష్టమవుతుందని అన్నారు కొందరు నిపుణులు.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నాయా?

అంతర్జాతీయ ముడి చమురు ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంతకాలానికి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వచ్చే ఆదాయ నష్టంలో కొంత భాగాన్ని చమురు కంపెనీలు వినియోగదారులపై మోపవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

ఇరాన్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు బ్యారెల్‌కు 72.87 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్న బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్, బుధవారం దాదాపు 40% పెరిగి బ్యారెల్‌కు 101.91 డాలర్లకు చేరగా, గురువారం బ్యారెల్‌కు 103 డాలర్లను దాటింది.

ప్రభుత్వం ఏమి చెబుతోంది?

పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో, ఇంధన ధరలపై ప్రస్తుతం ఉన్న స్తంభనను ఇకపై కొనసాగించడం రిటైలర్లకు మరింత కష్టంగా మారుతోందని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఇటీవల ఒక సెక్టార్ నోట్‌లో పేర్కొంది. తత్ఫలితంగా, ఏప్రిల్ 29వ తేదీ వరకు కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.25–రూ.28 వరకు గణనీయంగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.

ఇది కూడా చదవండి: Business Idea: రూ. 10 పెట్టుబడి.. రూ. 90 లాభం.. గాజుల వ్యాపారంతో కాసుల వర్షం – టాప్ 5 బిజినెస్ ఐడియాలు ఇవే!

అయితే, ప్రభుత్వం దీనిని ఖండించింది. అంతర్జాతీయ ధరలు పెరిగినప్పటికీ, చిల్లర ధరలను రూ.25-రూ.28 మేర పెంచే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. భయాందోళనలు సృష్టించే ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతులను పట్టించుకోవద్దని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.

ఇది కూడా చదవండి: వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట.. సర్వేలో షాకింగ్‌ నిజాలు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us