AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fuel Crisis: పెట్రోల్ కష్టాలు.. మూతపడుతున్న బంకులు.. క్యూ కడుతున్న జనం.. కారణం ఏంటంటే..!

Fuel Crisis: యుద్ధ భయాలు అంతర్జాతీయ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం, చమురు కంపెనీలు సరఫరాను క్రమబద్ధీకరించే ప్రయత్నంలో ఉన్నాయి. ప్రజలు అనవసరంగా భయపడి నిల్వలు పెంచుకోవడం వల్ల నిజమైన అవసరం ఉన్నవారికి ఇంధనం దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి, సంయమనం పాటించడం ఉత్తమం..

Fuel Crisis: పెట్రోల్ కష్టాలు.. మూతపడుతున్న బంకులు.. క్యూ కడుతున్న జనం.. కారణం ఏంటంటే..!
Fuel Crisis
Subhash Goud
|

Updated on: Apr 27, 2026 | 8:13 AM

Share

Fuel Crisis: అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దాని ప్రభావం ఏపీలోని పెట్రోల్ బంకులపై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం వస్తే చమురు ధరలు పెరగడమే కాకుండా, సరఫరా నిలిచిపోతుందనే భయంతో ప్రజలు ఒక్కసారిగా బంకుల వద్ద బారులు తీరారు. భయంతో ముందస్తుగా కొనడం కారణంగా రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడింది.

ఏపీలో ప్రస్తుత పరిస్థితి: గణాంకాలతో సహా..

  • ఏపీ రాష్ట్రంలో మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉండగా, వాటిలో దాదాపు 421 బంకులు (సుమారు 10 శాతం) స్టాక్ లేక బోర్డులు తిప్పేయడం ఆందోళన కలిగిస్తోంది.
  • పెరిగిన డిమాండ్: సాధారణ రోజులతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ వినియోగం ఒక్కసారిగా 50 శాతం పైగా పెరిగింది.
  • అమ్మకాల వివరాలు: సాధారణంగా రోజుకు 6,330 కిలో లీటర్ల పెట్రోల్ అమ్ముడవుతుండగా, శనివారం అది 10,345 కిలో లీటర్లకు చేరింది.
  • డీజిల్ విక్రయాలు కూడా 9,048 కిలో లీటర్ల నుండి ఏకంగా 14,156 కిలో లీటర్లకు పెరిగాయి.

సరఫరా గతంలో కంటే 10 శాతం పెంచినప్పటికీ, వినియోగదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడమే కాకుండా అదనపు నిల్వలకు ప్రయత్నిస్తుండటంతో బంకుల్లో నిల్వలు త్వరగా నిండుకుంటున్నాయి.

సీఎం చంద్రబాబు సమీక్ష – కీలక ఆదేశాలు

రాష్ట్రంలో నెలకొన్న ఈ అసాధారణ పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారుల నుంచి క్షేత్రస్థాయి నివేదికలను కోరారు.

  • ఆక్వా రంగానికి ఇబ్బందులు: ఆక్వా రైతులు డ్రమ్‌లలో డీజిల్ కొనుగోలు చేస్తారని, ప్రస్తుతం వారికి సరఫరా చేయడంలో సమస్యలు వస్తున్నాయని సీఎం దృష్టికి వచ్చింది. దీనిపై కలెక్టర్లు, ఫిషరీష్ శాఖ అధికారులు వెంటనే చర్చించి పరిష్కారం చూపాలని ఆదేశించారు.
  • భయాలను తగ్గించే చర్యలు: ఇంధన సరఫరాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, రద్దీని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తీసుకున్న చర్యలు, ప్రస్తుత పురోగతిపై సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
  • ఆందోళన అవసరమా?
  • యుద్ధ భయాలు అంతర్జాతీయ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం, చమురు కంపెనీలు సరఫరాను క్రమబద్ధీకరించే ప్రయత్నంలో ఉన్నాయి. ప్రజలు అనవసరంగా భయపడి నిల్వలు పెంచుకోవడం వల్ల నిజమైన అవసరం ఉన్నవారికి ఇంధనం దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి, సంయమనం పాటించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్ గంటకు ఎంత కరెంట్ వాడుతుందో తెలుసా? కళ్లు చెదిరే విద్యుత్ లెక్కలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us