AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: నిర్మలమ్మా మీకు అర్థమయ్యిందా? బ్యాంకింగ్, బీమా రంగాలు బడ్జెట్లో ఆశిస్తున్నవి ఇవే..

ఈ నెలాఖరులో పార్లమెంట్ వేదికగా ఆమె బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ బడ్జెట్ పై అన్ని రంగాల్లోనూ ఆసక్తి ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, బీమా సెక్టార్లు తమ సమస్యలపై మంత్రి స్పందిస్తారని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్న నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2024 నుంచి బ్యాంకింగ్ రంగం ఆశిస్తున్న ప్రధాన అంశాలు, బీమా సెక్టార్ ఊహిస్తున్న విషయాలతో ప్రత్యేక కథనం..

Budget 2024: నిర్మలమ్మా మీకు అర్థమయ్యిందా? బ్యాంకింగ్, బీమా రంగాలు బడ్జెట్లో ఆశిస్తున్నవి ఇవే..
Budget 2024
Madhu
|

Updated on: Jul 05, 2024 | 5:47 PM

Share

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తన ఏడో బడ్జెట్ ను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెలాఖరులో పార్లమెంట్ వేదికగా ఆమె బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ బడ్జెట్ పై అన్ని రంగాల్లోనూ ఆసక్తి ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, బీమా సెక్టార్లు తమ సమస్యలపై మంత్రి స్పందిస్తారని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్న నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2024 నుంచి బ్యాంకింగ్ రంగం ఆశిస్తున్న ప్రధాన అంశాలు, బీమా సెక్టార్ ఊహిస్తున్న విషయాలతో ప్రత్యేక కథనం..

బ్యాంకింగ్ కు సంబంధించి.. 2021-22 బడ్జెట్‌లో, రూ. 1.75 ట్రిలియన్లను సంపాదించాలనే లక్ష్యంతో డిజిన్వెస్ట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) ప్రైవేటీకరణను సీతారామన్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఐడీబీఐ బ్యాంక్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్విటీ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సూచించిన 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా ఆమె పీఎస్బీలలో మరింత ఈక్విటీ డైల్యూషన్‌ను ఈ బడ్జెట్లో ప్రకటిస్తారేమో అని ఆర్థిక పరిశీలకులు ఆసక్తిగా ఉన్నారు. 2021-22లో ఐడీబీఐ బ్యాంక్‌తో పాటు మరో రెండు పీఎస్‌బీలు, ఒక సాధారణ బీమా సంస్థను ప్రభుత్వం ప్రైవేటీకరించనుందని సీతారామన్ చెప్పారు. నిపుణులు ఈ విషయంలో ఎలాంటి తక్షణ ప్రకటనను ఆశించడం లేదు. భారతదేశంలో 12 ప్రభుత్వ-యాజమాన్య బ్యాంకులు ఉన్నాయి. ఇవి బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ఆస్తులలో దాదాపు 60 శాతాన్ని సమష్టిగా నిర్వహిస్తాయి.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐదు రోజుల బ్యాంకింగ్ పాలనపై ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటన చేస్తుందని బ్యాంకింగ్ రంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. డిపాజిట్లు, గృహ రుణాలపై పన్ను మినహాయింపు, అలాగే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) కోసం ప్రత్యేక రీఫైనాన్సింగ్ ఎంటిటీని ఏర్పాటు చేయడంతో సహా బడ్జెట్ కోసం బ్యాంకర్లు అనేక ప్రతిపాదనలు సిద్దం చేసుకున్నారు

అలాగే ఖాతాదారులు సంపాదించే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపును కూడా కొంతమంది నిపుణులు కోరుతున్నారు. వడ్డీ ఆదాయాలపై పన్నుకు సంబంధించి కొంత ఉపశమనం కల్పించగలిగితే, అది డిపాజిటర్లను ప్రోత్సహించినట్లు అవుతుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ అన్ని శాఖలలోని డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయం సంవత్సరానికి రూ. 40,000 దాటితే దానిపై పన్ను మినహాయించవలసి ఉంటుంది. పొదుపు ఖాతాల కోసం, సంవత్సరానికి రూ. 10,000 వరకు వడ్డీ ఆదాయాలు పన్ను నుంచి మినహాయింపు పొందుతాయి.

బీమా సెక్టార్ కు సంబంధించి.. బీమా చట్టాన్ని సంస్కరించడానికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనకు ప్రాధాన్యం ఇవ్వవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 2022లో ఆర్థిక మంత్రిత్వ శాఖ 1938 బీమా చట్టం, 1999 ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్‌కి ప్రతిపాదిత సవరణలపై ప్రజల అభిప్రాయాలను కోరింది. బీమా మధ్యవర్తులు, క్యాప్టివ్ ఇన్సురెన్స్‌లకు సంబంధించిన ఇతర మార్పులతో పాటు బీమా సంస్థలకు మిశ్రమ లైసెన్సింగ్‌ను ప్రవేశపెట్టాలని ఈ సవరణలు సూచించాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..