Toll Plazas: ఇక జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు ఉండవు.. త్వరలో దేశ వ్యాప్తంగా కొత్త పథకం!

Toll Plazas: కేంద్ర ప్రభుత్వం వాహనదారుల విషయంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా టోల్‌ప్లాజాల విషయంలో కూడా పలు నిర్ణయాలు తీసుకుంటోంది..

Toll Plazas: ఇక జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు ఉండవు.. త్వరలో దేశ వ్యాప్తంగా కొత్త పథకం!
Toll Plazas
Follow us

|

Updated on: Aug 25, 2022 | 9:49 AM

Toll Plazas: కేంద్ర ప్రభుత్వం వాహనదారుల విషయంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా టోల్‌ప్లాజాల విషయంలో కూడా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. రాబోయే కాలంలో దేశంలో టోల్ ప్లాజా ఉండదు. కెమెరాల ద్వారా ఆటోమేటిక్ టోల్ చెల్లింపు పథకంపై ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరాల ప్రకారం.. ఇది పైలట్ ప్రాతిపదికన ప్రారంభించబడుతోంది. దీనికి సంబంధించిన చట్టపరమైన మార్పులకు కూడా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ చర్యతో టోల్ చెల్లింపు పనులు చాలా వేగంగా పూర్తవుతాయి. వాహనాల జామ్‌ను కూడా తొలగిపోతుంది. అదే సమయంలో టోల్ విషయంలో పారదర్శకత కూడా నిర్వహించబడుతుంది. ఫాస్టాగ్ కారణంగా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్య మెరుగుపడింది. ఫాస్ట్‌ట్యాగ్స్‌ ఏర్పాటు వల్ల టోల్‌ ప్లాజాను దాటడానికి వాహనాలు తీసుకునే సగటు సమయాన్ని తగ్గించారు. ఫాస్ట్‌ట్యాగ్‌ను ఉపయోగించి వాహనం దాటడానికి దాదాపు 47 సెకన్లు పడుతుంది. గంటలో దాదాపు 260 వాహనాలను ప్రాసెస్‌ చేయవచ్చు.

మరో వైపు మాన్యువల్‌ టోల్‌ కలెక్షన్‌ లేన్‌ గంటలో 112 వాహనాలను మాత్రమే ప్రాసెస్‌ చేస్తుంది. భారతదేశంలో మొత్తం టోల్‌ వసూలులో దాదాపు 97 శాతం ఫాస్ట్‌ట్యాగ్‌ల ద్వారానే జరుగుతుంది. రూ.40,000 కోట్లలో కేవలం 3 శాతం మాత్రమే నగదు, కార్డుల ద్వారా టోల్‌ వసూలు జరుగుతుంది. ఫిబ్రవరి 16,2021 నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌లు తప్పనిసరి చేసింది కేంద్రం. అయినప్పటికీ ఫాస్ట్‌ట్యాగ్‌లతో కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. తక్కువ బ్యాలెన్స్‌ ఉన్న వినియోగదారులు ప్లాజా లేన్‌లోకి ప్రవేశిస్తారు. ఫలితంగా రద్దీ ఏర్పడుతుంది. కొన్ని ప్లాజాలలో ఇంటర్నెల్‌ కనెక్టివిటీ సమస్య కారణంగా తక్కువ బ్యాలెన్స్‌ ఫాస్ట్‌ట్యాగ్ స్థితి త్వరగా యాక్టివ్‌ ఫాస్ట్‌ట్యాగ్‌కు అప్‌డేట్‌ చేయబడదు. ఇది ట్రాఫిక్‌ రద్దీకి కారణంగా మారిపోతుంది. ఆటోమేటిక్‌ నంబర్ ప్లేట్‌రీడర్‌లతో ప్రాసెసింగ్‌ సమయం మరింత తగ్గుతుందని భావిస్తున్నారు.

ప్రభుత్వ ప్రణాళిక ఏమిటి..?

ఇవి కూడా చదవండి

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ..2019 సంవత్సరంలో కంపెనీ బిగించే నంబర్ ప్లేట్‌లకు సంబంధించి ప్రభుత్వం ఒక నియమాన్ని జారీ చేసిందని చెప్పారు. దీని వల్ల గత 4 ఏళ్లలో వచ్చిన వాహనాలన్నింటికీ కంపెనీ నంబర్‌ ప్లేట్‌లను అమర్చారు. ఇప్పుడు టోల్ ప్లాజాలను తొలగించి, వాటి స్థానంలో ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.0 ఈ నంబర్ ప్లేట్ల గురించి సమాచారాన్ని తీసుకొని ఈ వాహనాలకు జోడించిన బ్యాంకు ఖాతాల నుండి ఛార్జీలను వసూలు చేసే విధంగా చర్యలు చేపడుతోంది. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ జరుగుతోంది. త్వరలో ఇది దేశవ్యాప్తంగా అమలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని అన్నారు.

సమస్య ఏమిటి..?

ఈ పథకం అమలులో ఒకే ఒక్క సమస్య ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. కెమెరా ద్వారా టోల్ చెల్లించని వారికి శిక్ష గురించి వివరించారు. సమాచార చట్టంలో ప్రస్తుతం అలాంటి నిబంధన లేదు. ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందు ఈ నిబంధనకు అదనంగా ఈ చట్టాలను తీసుకురావాల్సి ఉంటుందని, తద్వారా ప్రత్యేక నంబర్ ప్లేట్ లేని కార్లను నిర్ణీత సమయంలో అమర్చాలని గడ్కరీ చెప్పారు. ఈ రెండు దశల తర్వాత కెమెరా ద్వారా టోల్ చెల్లించే పథకాన్ని అమలు చేయవచ్చని పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..