AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: జనవరి 1 నుంచి రూ.1000 నోట్ వస్తుందా? రూ.2000 నోట్లు రద్దు అవుతున్నాయా? ఇందులో నిజమెంత? ఇదిగో క్లారిటీ!

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత ఇప్పుడు కొత్త సంవత్సరానికి ముందు 1000 రూపాయల నోటు, 2000 రూపాయల నోట్ల గురించి ఎన్నో..

Fact Check: జనవరి 1 నుంచి రూ.1000 నోట్ వస్తుందా? రూ.2000 నోట్లు రద్దు అవుతున్నాయా? ఇందులో నిజమెంత? ఇదిగో క్లారిటీ!
Indian Currency Notes
Subhash Goud
|

Updated on: Dec 25, 2022 | 1:57 PM

Share

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత ఇప్పుడు కొత్త సంవత్సరానికి ముందు 1000 రూపాయల నోటు, 2000 రూపాయల నోట్ల గురించి ఎన్నో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా మరోసారి రూ.1000 నోట్లను ప్రారంభించబోతోందని, దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా రకాల పోస్ట్‌లు వస్తున్నాయి. నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేస్తుంది. జనవరి 1 నుంచి 1000 రూపాయల కొత్త నోటు వస్తుందని ఆర్బీఐ తెలిపిందంటూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే 2 వేల రూపాయల నోట్లను కూడా రద్దు చేస్తున్నట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చింది. నోట్ల ముద్రన నిలిచిపోయింది తప్ప రద్దు చేసే ఆలోచన లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ విషయం పక్కనపెడితే.. జనవరి 1వ తేదీ నుంచి ఆర్బీఐ వెయ్యి రూపాయల నోటును విడుదల చేయనున్నట్లు సోషల్‌ మీడియా వేదిక ద్వారా వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి వార్తలపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్‌ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

ఇందులో నిజమెంత..?

ఈ మేరకు పీఐబీ అధికారిక ట్వీట్‌ చేసింది. జనవరి 1 నుంచి కొత్త రూ.1000 నోట్లు రానున్నాయని, రూ.2000 నోట్లు రద్దు అవుతాయని వైరల్‌ అవుతున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని, ఇలాంటి వార్తలు పూర్తిగా నకిలీవని స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక ట్వీట్‌లో పేర్కొంది. ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ అని, ఎవ్వరు కూడా నమ్మవద్దని సూచించింది. రూ.2000 నోట్లను రద్దు చేయడం, జనవరి 1 నుంచి కొత్తగా రూ.1000 నోటును తీసుకువచ్చే ఆలోచన లేదని, ఇవి నిజం కాదని పీఐబీ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదు:

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఇలాంటి పోస్టులు పూర్తిగా నకిలీదని పీఐబీ గుర్తించింది. రిజర్వ్ బ్యాంక్ అలాంటి ప్లాన్ చేయలేదని, అలాగే 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకునే ప్రణాళిక కూడా లేదని స్పష్టం చేసింది. అలాంటి పోస్ట్‌లను షేర్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

వైరస్‌ న్యూస్‌పై సమాచారం అందించండి

మీరు వైరల్ సందేశాన్ని తనిఖీని కూడా చేయవచ్చు. మీకు కూడా అలాంటి సందేశం వచ్చినట్లయితే టెన్షన్‌ పడకండి. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను ఎవరితోనూ షేర్ చేయవద్దు. ఇది కాకుండా మీరు ఏదైనా వార్తల వాస్తవ తనిఖీని కూడా చేయవచ్చు. దీని కోసం మీరు అధికారిక లింక్ https://factcheck.pib.gov.in/ సందర్శించాలి. ఇది కాకుండా మీరు వాట్సాప్ నంబర్ +918799711259 లేదా ఇమెయిల్: pibfactcheck@gmail.com కి కూడా వీడియోను పంపవచ్చు. దీనిపై తనిఖీ నిర్వహించి వెంటనే క్లారిటీ ఇస్తామని పీఐబీ తెలిపింది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై