AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి RBI కొత్త రూల్స్ తెచ్చిందా? అసలు విషయం చెప్పిన కేంద్రం!

Fact Check: నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోదీ పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొత్త రూ.500, రూ.2000 నోట్లను చలామణిలోకి తెచ్చారు. అయితే, రూ.2000 నోట్లను కూడా ఉపసంహరించుకునే ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం మార్కెట్‌లో చెల్లుబాటులో ఉన్నది కొత్త సిరీస్ నోట్లు మాత్రమే.

Fact Check: పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి RBI కొత్త రూల్స్ తెచ్చిందా? అసలు విషయం చెప్పిన కేంద్రం!
Fact Check
Subhash Goud
|

Updated on: Apr 19, 2026 | 6:38 AM

Share

Fact Check: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పాత నోట్లకు సంబంధించి ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) పాత రూ.500, రూ.1000 నోట్లను మార్చుకోవడానికి కొత్త నిబంధనలు తీసుకువచ్చిందని, దీనికి సంబంధించి గవర్నర్ ప్రకటన చేశారని ఒక స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

వైరల్ అవుతున్న ఆ పోస్ట్‌లో ఏముంది?

ఇవి కూడా చదవండి

“RBI Issues New Rules for old 500 and 1000 notes, know the complete information” అనే హెడ్‌లైన్‌తో ఉన్న ఒక వార్తలో ఆర్‌బీఐ గవర్నర్ ఫోటో, పాత నోట్ల చిత్రాలను జోడించారు. దీంతో ప్రజల్లో మళ్ళీ పాత నోట్లు మార్చుకునే అవకాశం వచ్చిందా అనే చర్చ మొదలైంది.

పీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్:

ఈ వైరల్ వార్తపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పందించింది. దీనిని ఒక ఫేక్ న్యూస్ (నకిలీ వార్త) గా తేల్చి చెప్పింది. ఆర్‌బీఐ పాత నోట్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఈ వార్తలో ఆర్‌బీఐ గవర్నర్ ఫోటో ఉన్నప్పటికీ, అది పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రయత్నమని వెల్లడించింది.

ప్రజలు ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని హెచ్చరించింది. కరెన్సీకి సంబంధించిన ఏ సమాచారానికైనా ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.

నోట్ల రద్దు నేపథ్యం:

నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోదీ పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొత్త రూ.500, రూ.2000 నోట్లను చలామణిలోకి తెచ్చారు. అయితే, రూ.2000 నోట్లను కూడా ఉపసంహరించుకునే ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం మార్కెట్‌లో చెల్లుబాటులో ఉన్నది కొత్త సిరీస్ నోట్లు మాత్రమే.

సలహా: మీరు ఇలాంటి అనుమానాస్పద సమాచారాన్ని చూసినప్పుడు, వెంటనే పిఐబి ఫ్యాక్ట్ చెక్ వాట్సాప్ నంబర్‌కు పంపి దాని వాస్తవికతను తెలుసుకోవచ్చు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం చట్టరీత్యా నేరం.

ఇది కూడా చదవండి: Gold Price Today: అక్షయ తృతీయ.. బంగారం, వెండి ధరలు తగ్గాయా? పెరిగాయా? హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us