AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు ముందు ఎందుకు సమర్పిస్తారు?

ఈరోజు బడ్జెట్‌కు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టే సంప్రదాయం ఉంది. ఈ సర్వేను ప్రభుత్వ రిపోర్ట్ కార్డ్‌గా చూస్తారు. ఈ నివేదిక ద్వారా ప్రభుత్వం గత ఒక సంవత్సరం పనిని సమీక్షించి భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. బడ్జెట్‌కు ముందు దీన్ని ఎందుకు సమర్పి్స్తారు? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం...

Budget 2024: ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు ముందు ఎందుకు సమర్పిస్తారు?
Budget 2024
Subhash Goud
| Edited By: |

Updated on: Jul 22, 2024 | 10:27 PM

Share

ఈరోజు బడ్జెట్‌కు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టే సంప్రదాయం ఉంది. ఈ సర్వేను ప్రభుత్వ రిపోర్ట్ కార్డ్‌గా చూస్తారు. ఈ నివేదిక ద్వారా ప్రభుత్వం గత ఒక సంవత్సరం పనిని సమీక్షించి భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. బడ్జెట్‌కు ముందు దీన్ని ఎందుకు సమర్పి్స్తారు? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

ఆర్థిక సర్వే అంటే ఏమిటి?

పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఇది బడ్జెట్ ప్రధాన ఆధారం, ఇది ఆర్థిక వ్యవస్థ పూర్తి చిత్రాన్ని ఇస్తుంది. గత ఆర్థిక సంవత్సరం సమీక్ష ఆధారంగా తయారు చేయబడింది. దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ తాజా పరిస్థితి గురించి ప్రభుత్వం చెబుతుంది. ఏడాది పొడవునా అభివృద్ధి ట్రెండ్, ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వచ్చింది? ఏ రంగంలో CAN-సీ పథకాలు ఎలా అమలు చేశారు..వంటి మొత్తం సమాచారం ఇందులో ఉంటుంది.

ఆర్థిక సర్వే ఎందుకు ముఖ్యమైనది?

ఆర్థిక సర్వే ద్వారా ప్రభుత్వం దేశ ఆర్థిక స్థితిగతుల గురించి మెరుగైన చిత్రాన్ని అందజేస్తుంది. ఇందులో పని, ఉపాధి, జీడీపీ గణాంకాలు, బడ్జెట్ లోటు, గత ఏడాది ద్రవ్యోల్బణం వంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారం నమోదు చేయబడుతుంది. దీని ద్వారా దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు సర్వేను సిద్ధం చేస్తారు.

ఆర్థిక సర్వే అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక పత్రం. ఇందులో దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి. దేశం ఎక్కడ లాభపడిందో, ఎక్కడ నష్టపోయిందో ఈ సర్వే తెలియజేస్తోంది. ఈ స‌ర్వే ఆధారంగా వ‌చ్చే సంవ‌త్సరంలో ఆర్థిక వ్యవ‌స్థలో ఎలాంటి అవ‌కాశాలు క‌నిపిస్తాయో నిర్ణయించ‌నున్నారు.

సర్వే నివేదికను ఎవరు సిద్ధం చేస్తారు?

ఆర్థిక సర్వే నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక విభాగం రూపొందిస్తుంది. ఇది ప్రధానంగా ప్రధాన ఆర్థిక సలహాదారు పర్యవేక్షణలో తయారు అవుతుంది. ఈ ఏడాది ఈ ఆర్థిక సర్వేను ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత్ నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం రూపొందించింది.

ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది:

1. ఆర్థిక సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ చిత్రాన్ని వెల్లడిస్తుంది. దీంతో దేశంలోని ద్రవ్యోల్బణం నుంచి నిరుద్యోగం వరకు లెక్కలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతుంది.

2. దీని వల్ల ప్రభుత్వ భవిష్యత్తు విధానం, రోడ్‌మ్యాప్ గురించి సామాన్యులకు తెలుస్తుంది.

3. ఆర్థిక సర్వేలో వివిధ రంగాల పనితీరు గురించి, పెట్టుబడి, పొదుపు విషయంలో దేశం ఎంత అభివృద్ధి చేసింది అనే దాని గురించి కూడా సమాచారం ఇవ్వబడింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి