AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: బడ్జెట్‌లో 9 రంగాలకు ప్రాధాన్యత: ఆర్థిక శాఖ మంత్రి

పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ 2024 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఆరోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టి నిర్మలమ్మ రికార్డు సృష్టించారు. అయితే అత్యధికంగా అంటే 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రుల్లో మురార్జీ దేశాయి ఉండగా, వరసగా ఆరుసార్లు..

Budget 2024: బడ్జెట్‌లో 9 రంగాలకు ప్రాధాన్యత: ఆర్థిక శాఖ మంత్రి
Union Budget 2024
Subhash Goud
|

Updated on: Jul 23, 2024 | 3:12 PM

Share

పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ 2024 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఆరోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టి నిర్మలమ్మ రికార్డు సృష్టించారు. అయితే అత్యధికంగా అంటే 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రుల్లో మురార్జీ దేశాయి ఉండగా, వరసగా ఆరుసార్లు మాత్రమే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు వరుసగా ఏడు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రుల్లో నిర్మలమ్మ రికార్డు సృష్టించారు. అయితే బడ్జెట్‌ ప్రవేశపెట్టి నిర్మలమ్మ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌లో రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.

బడ్జెట్‌లో 9 రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ద్రవ్యోల్బణం స్థిరంగా తగ్గుతూ 4 శాతానికి చేరనుంది. నాలుగు అంశాలపై మధ్యంతర బడ్జెట్‌లో దృష్టి పెట్టామన్నారు. ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించామన్నారు.

అలాగే ఉద్యోగం, స్కిల్‌, ఎంఎస్‌ఎంఈలపై పూర్తి దృష్టి సారించినట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల మంది ఉపాధి కల్పించే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. వ్యవసాయ పరిశోధన రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పిన నిర్మలమ్మ.. కొత్తగా 109 వంగడాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. వచ్చే ఏడాదిలోపు ప్రకృతి వ్యవసాయంలోకి కోటి మంది రైతులు అని, నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపుకు కృషి చేస్తున్నట్లు, కూరగాయల ఉత్పత్తి కోసం భారీ స్థాయి క్లస్టర్ల అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అలాగే వ్యవసాయ రంగంలో స్టార్టప్స్‌కు ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించారు.

మొత్తం సంవత్సరం, అంతకు మించి ఈ బడ్జెట్‌లో మేము ముఖ్యంగా ఉపాధి, నైపుణ్యాలు, MSME, మధ్యతరగతిపై దృష్టి పెట్టామని అన్నారు. 2 లక్షల కోట్ల రూపాయల కేంద్ర వ్యయంతో 5 సంవత్సరాల కాలంలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యాలు, ఇతర అవకాశాలను సులభతరం చేయడానికి ప్రధాన మంత్రి 5 పథకాలు, కార్యక్రమాల ప్యాకేజీని ప్రకటించినందుకు సంతోషంగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు లీటర్‌ డీజిల్‌కు ఎంత మైలేజీ ఇస్తుందో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి