AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BPCL EV Stations: ప్రతీ 100 కి.మీలకు ఒక ఈవీ స్టేషన్‌.. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ కీలక నిర్ణయం.

రోజురోజుకీ పెట్రోల్‌, డీజీల్ ధరలు పెరుగుతుండడంతో ఎలక్ట్రానిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో కంపెనీలు సైతం ఈవీ వెహికిల్స్‌ తయారీలోకి దిగుతున్నాయి. అలాగే ప్రభుత్వాలు సైతం సబ్సిడీలు ప్రకటిస్తుండడంతో..

BPCL EV Stations: ప్రతీ 100 కి.మీలకు ఒక ఈవీ స్టేషన్‌.. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ కీలక నిర్ణయం.
Bpcl Ev Stations
Narender Vaitla
|

Updated on: Mar 25, 2023 | 3:36 PM

Share

రోజురోజుకీ పెట్రోల్‌, డీజీల్ ధరలు పెరుగుతుండడంతో ఎలక్ట్రానిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో కంపెనీలు సైతం ఈవీ వెహికిల్స్‌ తయారీలోకి దిగుతున్నాయి. అలాగే ప్రభుత్వాలు సైతం సబ్సిడీలు ప్రకటిస్తుండడంతో ఈవీ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీ ఛార్జింగ్ పాయింట్స్‌కి భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. ఇందులో భాగంగా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

కొత్తగా 19 ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది. కర్ణాటక, కేరళ, తమిళనాడులోని 15 హైవేల వెంబడి శుక్రవారం ఈ ఫాస్ట్ ఛార్జింగ్ కారిడార్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రతీ 100 కిలోమీటర్లకు ఒక ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. బీపీసీఎల్‌ దక్షిణాది రిటైల్ హెడ్ పుష్ప్ కుమార్ నాయర్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఈవీని 30 నిమిషాల్లో ఛార్జ్ చేస్తే కనీసం 125 కిలోమీటర్ల దూరం వెళ్ళేలా రూపొందించాం. అందుకే ప్రతి 100 కిలోమీటర్లకు ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

ప్రస్తుతం 500 ఈవీ పాయింట్స్‌ అందుబాటులో ఉండగా రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 7000 ఛార్జింగ్ పాయింట్‌లను ఏర్పాటు చేసే దిశగా కంపెనీ అడుగులు వేస్తున్నట్లు బీపీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రిటైల్) పిఎస్‌రవి తెలిపారు. దీనికి సుమారు రూ. 750 నుంచి 800 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. హైవే కారిడార్‌లో అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న ఏకైక చమురు ప్రధాన సంస్థ బీపీసీఎల్‌ అని ఆయన అన్నారు. పెట్రోల్‌తో నడిచే కారుకు ఇంధనం నింపడం కంటే ఈవీతో 35-40 శాతం చౌకగా ఉంటుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ధీరజ్ పొరపాటు.. ప్రేమ మనసుకు మరో గాయం.. ఇక దూరమే..
ధీరజ్ పొరపాటు.. ప్రేమ మనసుకు మరో గాయం.. ఇక దూరమే..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే