మహిళలకు గుడ్‏న్యూస్… కేంద్రం కీలక నిర్ణయం.. వారి అకౌంట్లోకి రూ.5000.. ఎలా అప్లై చేసుకోవాలంటే…

PM Matru Vandana Yojana: మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నో రకాల స్కీమ్స్ తీసుకువచ్చింది. రైతుల నుంచి సామాన్య మహిళల వరకు ఆర్థిక భరోసా కల్పించేందుకు

మహిళలకు గుడ్‏న్యూస్... కేంద్రం కీలక నిర్ణయం..  వారి అకౌంట్లోకి రూ.5000.. ఎలా అప్లై చేసుకోవాలంటే...
Pmmvy
Follow us

|

Updated on: May 09, 2021 | 4:36 PM

PM Matru Vandana Yojana: మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నో రకాల స్కీమ్స్ తీసుకువచ్చింది. రైతుల నుంచి సామాన్య మహిళల వరకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పలు రకాల పథకాలను అమలులోకి తెచ్చింది. అందులో ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన కూడా ఒకటి. ఈ పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు రూ.5000 అందిస్తోంది. ఇప్పటికే ఈ పథకంలో అనేక మంది మహిళలు చేరారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రూ.5000 నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయి. అయితే ఈ డబ్బులన్ని ఒకేసారి రావు. ఇవి కూడా విడతల వారీగానే మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి చేరతాయి. అయితే ఈ పథకం కేవలం ప్రెగ్నెంట్ మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. 19 ఏళ్ళ కన్నా ముందే ప్రెగ్నెంట్ అయినవారికి ఈ స్మీం వర్తించదు.

ఇక ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన పథకం విషయానికి వస్తే.. ఇందులో తొలి విడతలో భాగంగా రూ.1000 వస్తాయి. ఆ తర్వాత రెండో విడత కింద రూ.2 వేలు లభిస్తాయి. అలాగే చివరి విడతలో మారో రూ.2 వేలు వస్తాయి. ఇలా మొత్తం రూ. 5 వేలు మహిళల బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి చేరతాయి. ఇందులో మరో విషయం గుర్తుంచుకోవాలి. ఎవరతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు ఉన్నారో వారికి ఈ పథకం వర్తించదు. మరీ ఇంకెందుకు ఆలస్యం. ఒకవేళ మీరు ఇప్పటికీ ఈ పథకంలో చేరకపోతే ఇప్పుడే ఇందులో చేరండి. అదేలానో తెలుసుకుందామా.

ముందుగా మీరు ఈ పథకంలో చేరాలంటే.. ఆన్‌లైన్‌లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఆశా వర్కర్ మిమ్మల్ని ఈ స్కీమ్‌లో చేర్పిస్తారు. www.Pmmvy-cas.nic.in లింక్ ద్వారా మీరు నేరుగా స్కీమ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు. అక్కడ బెనిఫీషియరీ లాగిన్ అని ఉంటుంది. రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి.

Also Read: విజయ్ ఫ్యాన్స్‏కు బ్యాడ్ న్యూస్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయమే మంచిదంటూ పూరీ టీం ట్వీట్..

Sonu Sood: సాయం చేయాలని వేడుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. 24 గంటల్లోనే హెల్ప్ చేసిన సోనూసూద్..