AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. ఎయిర్‌ ఇండియా సంస్థ నుంచి క్రేజీ అప్ డేట్..

దేశంలోని ప్రముఖ ఎయిర్‌ క్యారియర్‌ సంస్థ ఎయిర్‌ ఇండియా తన ప్రయాణికులకు అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెట్టింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులను ఆకర్షించే క్రమంలో ఈ ఆఫర్లను తీసుకొచ్చింది. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ప్రయాణికులు త్వరపడితేనే ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోనే అవకాశం ఉంటుంది.

Air India: విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. ఎయిర్‌ ఇండియా సంస్థ నుంచి క్రేజీ అప్ డేట్..
Air India
Madhu
|

Updated on: Mar 28, 2024 | 6:24 AM

Share

దేశంలోని ప్రముఖ ఎయిర్‌ క్యారియర్‌ సంస్థ ఎయిర్‌ ఇండియా తన ప్రయాణికులకు అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెట్టింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులను ఆకర్షించే క్రమంలో ఈ ఆఫర్లను తీసుకొచ్చింది. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ప్రయాణికులు త్వరపడితేనే ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోనే అవకాశం ఉంటుంది. మీరు దేశీయ ప్రయాణాలు చేస్తున్నా.. అంతర్జాతీయ ప్రయాణాలుచేస్తున్నా.. ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో ఆఫర్ల పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

జీరో కన్వీనియన్స్‌ ఫీజులు..

విమాన ప్రయాణాలకు టికెట్‌ ధరతో పాటు కన్వీనియన్స్‌ ఫీజులు కూడా వసూలు చేస్తారు. అయితే ఎయిర్‌ ఇండియా సంస్థ దీనిని పూర్తిగా రద్దు చేసింది. దేశీయ విమానాలలో జీరో కన్వీనియన్స్ ఫీజులను ఆస్వాదించడానికి విమానయాన సంస్థ ప్రయాణికులను అనుమతిస్తోంది. కంపెనీ షేర్ చేసిన వివరాల ప్రకారం, ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. మార్చి చివరి వరకు దీనిని వినియోగించుకోవచ్చు.

ఫ్లయింగ్ రిటర్న్స్ ఆఫర్..

విమానంలో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి, టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ‘ఫ్లయింగ్ రిటర్న్స్ ఆఫర్’ అనే పేరుతో ప్రత్యేక డీల్‌ ను కూడా ప్రవేశపెట్టింది. ఇది దేశీయ, అంతర్జాతీయ విమానాలు రెండింటికీ వర్తిస్తుంది. ప్రయాణికులు విమానాల్లో ప్రయాణాల ద్వారా సంపాదించిన పాయింట్‌లను ఉపయోగించి కాంప్లిమెంటరీ అప్‌గ్రేడ్‌లు, ఇతర ప్రయోజనాలను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఫ్లయింగ్ రిటర్న్స్ ఆఫర్ ఎలా పొందాలంటే..

పరిమిత కాల ఆఫర్‌ను ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. ఈ ఏడాది చివరి వరకు ప్రయోజనం పొందవచ్చు. అయితే, ఆసక్తి ఉన్న కస్టమర్‌లు ఆఫర్‌ను ఆస్వాదించడానికి ఏప్రిల్ 30, 2024లోపు టికెట్‌లను బుక్ చేసుకోవాలని సూచించారు.

ఎయిర్ ఇండియాపై డీజీసీఏ భారీ జరిమానా..

ఎయిర్ ఇండియా సంస్థపై డీజీసీఏ భారీ జరిమానా విధించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్‌డిటిఎల్, ఫ్లైట్ సిబ్బంది ఫెటీగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎఫ్‌ఎంఎస్) నిబంధనల ఉల్లంఘన కారణంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ. 80 లక్షల జరిమానా విధించింది. ఫలితంగా ఎయిర్‌లైన్ కఠినమైన దశను ఎదుర్కొంటోంది. అంతకుముందు, దాని కోసం ఎయిర్‌లైన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే ఇది “సంతృప్తికరంగా లేకపోవడంతో తప్పు జరిగినట్లుగా పరిగణించి కంపెనీకి భారీ జరిమానా విధించింది. దీంతో ఎయిర్‌ లైన్‌ సంస్థ ప్రస్తుతం కఠిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..