AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Company: ఆదానీ కంపెనీకి టెలికాం శాఖ నోటీసులు.. ఎందుకో తెలుసా?

వేలంలో 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసి ఇంకా అమలు చేయని అదానీ గ్రూప్ కంపెనీకి కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. భారతదేశంలో 5G సేవ ఇంకా వాణిజ్యపరంగా ఎందుకు అమలు చేయడం లేదని, ఆలస్యం ఎందుకు అవుతోందనేదానిపై సమాధానం ఇవ్వాలని కోరుతూ అదానీ డేటా నెట్‌వర్క్స్ లిమిటెడ్ కంపెనీకి డిపార్ట్‌మెంట్ ఈ నోటీసును జారీ చేసింది. స్పెక్ట్రమ్ వేలంలో రూపొందించిన..

Adani Company: ఆదానీ కంపెనీకి టెలికాం శాఖ నోటీసులు.. ఎందుకో తెలుసా?
Adani Company
Subhash Goud
|

Updated on: Aug 12, 2024 | 1:45 PM

Share

వేలంలో 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసి ఇంకా అమలు చేయని అదానీ గ్రూప్ కంపెనీకి కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. భారతదేశంలో 5G సేవ ఇంకా వాణిజ్యపరంగా ఎందుకు అమలు చేయడం లేదని, ఆలస్యం ఎందుకు అవుతోందనేదానిపై సమాధానం ఇవ్వాలని కోరుతూ అదానీ డేటా నెట్‌వర్క్స్ లిమిటెడ్ కంపెనీకి డిపార్ట్‌మెంట్ ఈ నోటీసును జారీ చేసింది. స్పెక్ట్రమ్ వేలంలో రూపొందించిన నిబంధనల ప్రకారం కమర్షియల్ 5G నెట్‌వర్క్ తప్పనిసరిగా అక్టోబర్ 10, 2024లోపు ఇన్‌స్టాల్ చేయాలి. లేదంటే ప్రభుత్వం ఇచ్చిన స్పెక్ట్రమ్‌ను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.

అదానీ కంపెనీ తన వ్యాపారం కోసం 5G స్పెక్ట్రమ్‌ను పొందింది:

వేలంలో 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటికే వాణిజ్యపరంగా 5G సేవలను ప్రతిచోటా అమలు చేస్తున్నాయి. వోడాఫోన్ ఐడియా ఆలస్యంగానైనా 5G నెట్‌వర్క్‌ను కూడా ప్రారంభించింది. వేలంలో పాల్గొని స్పెక్ట్రమ్ కేటాయింపును పొందిన అదానీ ఇంకా వాణిజ్య 5G సేవను ప్రారంభించలేదు. విమానాశ్రయం, పోర్టులను అదానీ గ్రూప్ నిర్వహిస్తోంది. దీనికి సమీపంలో ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఈ వ్యాపారాల కోసం బిడ్ల ద్వారా 5G స్పెక్ట్రమ్‌ను సొంతంగా కొనుగోలు చేసింది. అయితే, కేవలం సొంత వ్యాపారానికే కాకుండా వాణిజ్యపరంగా కూడా 5G సేవను అందించడం తప్పనిసరి. ఈ ఏడాది ప్రారంభంలో కూడా అదానీ గ్రూపునకు ఈ విషయమై నోటీసులు అందాయి. ఇప్పుడు అక్టోబరు గడువు సమీపిస్తుండటంతో మళ్లీ నోటీసులిచ్చింది.

ఇది కూడా చదవండి: Hindenburg: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అంటే ఏమిటి ? దీని పనేంటి? దీని యజమాని ఎవరు?

అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన అదానీ డేటా నెట్‌వర్క్స్, జూలై 2022 స్పెక్ట్రమ్ వేలంలో రూ. 212 కోట్లకు 26 GHz బ్యాండ్‌విడ్త్‌లో మొత్తం 400 MHz స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. ఈ ఆరు సర్కిళ్లకు కర్ణాటక, ఆంధ్రా, గుజరాత్, ముంబై, తమిళనాడు, రాజస్థాన్‌లు స్పెక్ట్రమ్‌ను పొందాయి.

ఇది కూడా చదవండి: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు

వాణిజ్యపరంగా 5G అమలు చేయకపోతే ఏం జరుగుతుంది?

అక్టోబర్ 10 నాటికి వాణిజ్య 5G స్పెక్ట్రమ్‌ని అమలు చేయాలనే నియమం ఉంది. అలా జరగని పక్షంలో అక్టోబర్ 10 నుంచి 13 వారాల పాటు వారానికి రూ.లక్ష చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇన్‌స్టాలేషన్ చేయకుంటే వచ్చే 13 వారాలకు వారానికి రూ.2 లక్షల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తదుపరి 26 వారాలపాటు వారానికి రూ.4 లక్షల జరిమానా విధిస్తారు. 5G నెట్‌వర్క్ అమలులో జాప్యం 52 వారాలు దాటితే, అంటే అక్టోబర్ 2025 నాటికి అదానీ కంపెనీ 5G నెట్‌వర్క్‌ను వాణిజ్యపరంగా అమలు చేయకపోతే, స్పెక్ట్రమ్ కేటాయింపును రద్దు చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Gas Cylinder: వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.450లకే గ్యాస్‌ సిలిండర్‌.. ఎక్కడో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి