AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక ఈ పత్రాలన్ని కూడా ఒకే పోర్టల్‌లో అప్‌డేట్‌.. కేంద్రం సరికొత్త వ్యవస్థ.. ఇది ఎలా పని చేస్తుంది?

Aadaar, Pan Update: ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతోంది. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. కొన్ని సాంకేతిక, చట్టపరమైన సమస్యలు ఉన్నాయి. అవి పరిష్కారం చివరి దశలో ఉన్నాయి. ముఖ్యంగా డేటాను సురక్షితంగా ఉంచడానికి పూర్తి ప్రూఫ్ వ్యవస్థను రూపొందించడం ఒక సవాలుగా ఉంది..

ఇక ఈ పత్రాలన్ని కూడా ఒకే పోర్టల్‌లో అప్‌డేట్‌.. కేంద్రం సరికొత్త వ్యవస్థ.. ఇది ఎలా పని చేస్తుంది?
Subhash Goud
|

Updated on: Apr 28, 2025 | 1:57 PM

Share

ఆధార్, పాన్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన వాటిలో పేరు, చిరునామా, మొబైల్ నంబర్ మార్చడానికి ప్రజలు ఇకపై వేర్వేరు కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏకీకృత డిజిటల్ గుర్తింపు వ్యవస్థను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని కోసం ప్రజలు నిర్మిస్తున్న పోర్టల్‌లో ఒకే చోట చిరునామా, నంబర్ మొదలైన వాటిని అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఈ మార్పు అవసరమైన అన్ని గుర్తింపు కార్డులలో స్వయంచాలకంగా అప్‌డేట్‌ అవుతాయి.

ఈ పోర్టల్ ఎలా పనిచేస్తుంది?

ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి అన్ని గుర్తింపు కార్డులు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండే విధంగా పోర్టల్ రూపొదించారు. అప్‌డేట్ కోసం మీరు పోర్టల్‌కి వెళ్లి ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు మొబైల్ నంబర్ మార్చడానికి ప్రత్యేక ఆప్షన్‌ ఉంటుంది. చిరునామా మార్చడానికి ప్రత్యేక ఆప్షన్‌. సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలి. మార్పు మూడు పని దినాలలో అన్ని పత్రాలలో అప్‌డేట్‌ అవుతాయి.

కొత్త గుర్తింపు కార్డు ఎలా పొందాలి?

ఈ మార్పుతో ఈ పోర్టల్‌లో కొత్త గుర్తింపు కార్డు పొందడానికి ఒక ఎంపిక ఉంటుంది. దీని కోసం మీరు రుసుము చెల్లించి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కొత్త అప్‌డేట్‌తో కూడిన గుర్తింపు కార్డు 7 పని దినాలలోపు పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుతుంది. కార్యాలయానికి వెళ్లి గుర్తింపు కార్డు పొందాలనుకునే వారికి ఒక ఎంపిక కూడా ఉంది.ఆప్షన్ ఎంచుకున్న తర్వాత వారి మొబైల్‌లో అప్‌డేట్‌ చేసిన గుర్తింపు కార్డును పొందే తేదీ, సమయం వారికి తెలుస్తుంది.

ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతోంది. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. కొన్ని సాంకేతిక, చట్టపరమైన సమస్యలు ఉన్నాయి. అవి పరిష్కారం చివరి దశలో ఉన్నాయి. ముఖ్యంగా డేటాను సురక్షితంగా ఉంచడానికి పూర్తి ప్రూఫ్ వ్యవస్థను రూపొందించడం ఒక సవాలుగా ఉంది. ఇప్పటివరకు జరిగిన ట్రయల్ రన్లలో 92% కంటే ఎక్కువ ఖచ్చితత్వం సాధించింది.

98% లేదా అంతకంటే ఎక్కువ ఖచ్చితత్వం సాధించిన వెంటనే, దీనిని పరీక్ష కోసం అమలు చేస్తారు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఈ పోర్టల్ సాధారణ ప్రజల కోసం ప్రారంభించనున్నారు. అయితే పోర్టల్ పేరు ఇంకా నిర్ణయించలేదు. తుది పరీక్ష పూర్తయిన తర్వాత దాని పేరు నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా ఇది త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి