AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8వ వేతన సంఘం.. పెరిగిన జీతం ఎ‍ప్పుడిస్తారు? ఒకేసారి ఇస్తారా.. వాయిదాల్లోనా? క్లారిటీ వచ్చేసింది!

కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘంపై చర్చ జరుగుతోంది. పెరిగిన జీతం, బకాయిలు ఎప్పుడు వస్తాయనేది ప్రధాన ప్రశ్న. జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తే, జనవరి 2028 నాటికి పెరిగిన జీతాలు అందవచ్చు. బకాయిలు సాధారణంగా ఒకేసారి చెల్లిస్తారని డాక్టర్ మంజీత్ పటేల్ తెలిపారు.

8వ వేతన సంఘం.. పెరిగిన జీతం ఎ‍ప్పుడిస్తారు? ఒకేసారి ఇస్తారా.. వాయిదాల్లోనా? క్లారిటీ వచ్చేసింది!
8th Pay Commission
SN Pasha
|

Updated on: Jan 06, 2026 | 11:45 PM

Share

కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లలో ఎనిమిదవ వేతన సంఘం గురించే ఆలోచిస్తున్నారు. ఉద్యోగ వర్గాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల నుండి ఉద్యోగి సంస్థల వరకు, ప్రతి ఒక్కరి మదిలో ఒకటే ప్రశ్న మెదలుతోంది. పెరిగిన జీతం ఎప్పుడు వస్తుందని, బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు పడుతుందో అని ఎదురుచూస్తున్నారు. పాత బకాయిలను ఒకేసారి చెల్లిస్తారా? లేదా ప్రభుత్వం వాయిదాలలో చెల్లిస్తుందా? అనే డౌట్లు అందరిలో ఉన్నాయి.

ఈ అంశంపై ఆల్ ఇండియా NPS ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంజీత్ పటేల్ ఏమన్నారంటే.. నిబంధనల ప్రకారం.. 8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చినట్టే అయితే ప్రభుత్వ ప్రక్రియలకు సమయం పడుతుంది. ప్రభుత్వం వేతన సంఘానికి తన నివేదికను సిద్ధం చేసి సమర్పించడానికి దాదాపు 18 నెలల సమయం ఇచ్చింది. నివేదిక సమర్పించిన తర్వాత కూడా, క్యాబినెట్ ఆమోదం, అమలు పరిపాలనా ప్రక్రియకు మరో ఆరు నెలలు పట్టవచ్చు. ప్రతిదీ షెడ్యూల్ ప్రకారం జరిగితే ఉద్యోగులు జనవరి 2028 నాటికి వారి పెరిగిన జీతాలను అందుకుంటారని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం కాస్త చొరవ తీసుకుంటే జూలై 2027 నాటికి రావచ్చు.

వాయిదాల్లోనా? ఒకేసారినా?

వేతన కమిషన్ అమలులో జాప్యం వల్ల బకాయిల లెక్కింపు గణనీయంగా ఉంటుంది. ఉద్యోగులు తమ బకాయిలను వాయిదాలలో పొందుతారని ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ చరిత్రలో, బకాయిలను సాధారణంగా ఒకే మొత్తంలో చెల్లించేవారని వివరిస్తూ డాక్టర్ మంజీత్ పటేల్ ఈ సందేహాన్ని నివృత్తి చేశారు. ఎనిమిదవ వేతన సంఘం 2026 జనవరి 1 నుండి అమలులోకి వస్తుంది కాబట్టి, ఆ తేదీ నుండి బకాయిలు లెక్కిస్తారు. నిర్ణయం 2027 లో వచ్చినా లేదా 2028 లో వచ్చినా మునుపటి తేదీ నుండి బకాయిలు చెల్లిస్తారని అన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి