AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Bank: డిసెంబర్‌లో రూ.5000 నోట్లు విడుదల.. ఆ సెంట్రల్‌ బ్యాంకు కీలక ప్రకటన

భారత్ పొరుగు దేశం తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం, దేశీయ స్థాయిలో ప్రతి చిన్న అడుగు వేయడం మానుకోవడం లేదు. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ పెద్ద ప్రకటన చేసింది. కొత్త పాలిమర్ ప్లాస్టిక్ కరెన్సీ బ్యాంక్ నోట్ ఈ ఏడాది చివర్లో వినియోగంలోకి రానుంది..

Central Bank: డిసెంబర్‌లో రూ.5000 నోట్లు విడుదల.. ఆ సెంట్రల్‌ బ్యాంకు కీలక ప్రకటన
Currency
Subhash Goud
|

Updated on: Aug 24, 2024 | 6:52 PM

Share

భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం, దేశీయ స్థాయిలో ప్రతి చిన్న అడుగు వేయడం మానుకోవడం లేదు. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ పెద్ద ప్రకటన చేసింది. కొత్త పాలిమర్ ప్లాస్టిక్ కరెన్సీ బ్యాంక్ నోట్ ఈ ఏడాది చివర్లో వినియోగంలోకి రానుంది. సెంట్రల్ బ్యాంక్ మెరుగైన భద్రత, హోలోగ్రామ్ ఫీచర్ల కోసం ఇప్పటికే ఉన్న అన్ని బ్యాంకు నోట్లను కూడా రీడిజైన్ చేస్తుంది.

గవర్నర్ సమాచారం:

ప్రస్తుతం ఉన్న అన్ని పేపర్ కరెన్సీ నోట్లను ఈ ఏడాది డిసెంబరు నాటికి కొత్త భద్రతా ఫీచర్లతో రీడిజైన్ చేస్తున్నామని ఇస్లామాబాద్‌లోని బ్యాంకింగ్, ఫైనాన్స్ సెనేట్ కమిటీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ తెలిపారు. రూ.10, 50, 100, 500, 1000, 5000 డినామినేషన్లలో కొత్తగా రూపొందించిన బ్యాంకు నోట్లను డిసెంబర్‌లో విడుదల చేస్తామని అహ్మద్ తెలిపారు.

ఇది కూడా చదవండి: iPhone Crash: పొరపాటున మీ మొబైల్‌లో ఈ అక్షరాలను టైప్‌ చేస్తున్నారా? ప్రమాదమే.. ఫోన్‌ క్రాష్‌!

మీడియా కథనాల ప్రకారం.. పాత నోట్లు ఐదేళ్ల పాటు చెలామణిలో ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్ వాటిని మార్కెట్ నుండి తొలగిస్తుంది. కొత్త పాలిమర్ ప్లాస్టిక్ బ్యాంక్ నోట్‌ను ప్రజలకు ఒక డినామినేషన్‌లో జారీ చేస్తామని, మంచి స్పందన వస్తే, ఇతర డినామినేషన్లలో కూడా ప్లాస్టిక్ కరెన్సీని జారీ చేస్తామని స్టేట్ బ్యాంక్ గవర్నర్ సెనేట్ కమిటీకి తెలిపారు.

మొదటి దేశం ఆస్ట్రేలియా

దాదాపు 40 దేశాలు ప్రస్తుతం పాలిమర్ ప్లాస్టిక్ నోట్లను ఉపయోగిస్తున్నాయి. వీటిని నకిలీ చేయడం కష్టం, హోలోగ్రామ్‌లు, పారదర్శక విండోలు వంటి మరింత అధునాతన భద్రతా లక్షణాలను కలిగి ఉన్నాయి. 1998లో పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టిన మొదటి దేశం ఆస్ట్రేలియా. రూ. 5,000 నోటును రద్దు చేసే ఆలోచన సెంట్రల్ బ్యాంక్‌కు లేదని అహ్మద్ ధృవీకరించారు. అయితే, దీనివల్ల అవినీతిపరులు తమ వ్యాపారాలు చేసుకోవడం సులభతరం అవుతుందని సభ్యుడు మొహ్సిన్ అజీజ్ పట్టుబట్టారు.

ఇది కూడా చదవండి: Indian Railways: ఒకే రైలు టికెట్‌పై 56 రోజుల ప్రయాణం.. సర్క్యులర్ జర్నీ టికెట్‌ గురించి మీకు తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి