మహా విషాదం- బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా : వెంకయ్య

విశాఖ దుర్ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ గ్యాస్ లీకేజి సంఘటన

మహా విషాదం- బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా : వెంకయ్య
Follow us

|

Updated on: May 07, 2020 | 11:35 AM

విశాఖ దుర్ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ గ్యాస్ లీకేజి సంఘటన మహా విషాదమనీ,  దారుణ ఘ‌ట‌న‌ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.  ఈ దారుణ ఘటనలో మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ఈ ఘటనపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డితో ఆయన మాట్లాడారు.  ఈ విషయంలో అవసరమైన సహాయం అందిస్తున్నట్లు వారు తెలిపారనీ, . ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికారుల ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు చేపట్టామని హోంశాఖ కార్యదర్శి తెలిపారనీ వెంకయ్య అన్నారు.