ఈ కరోనా మహమ్మారి ఆ ఘటనకన్నా ఘోరం.. ట్రంప్

కరోనా మహమ్మారి అమెరికాను దారుణంగా తాకిందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. 1941 లో హవాయిపై జపాన్ జరిపిన దాడిని గుర్తు చేస్తూ.., చివరకు అది అమెరికా, జపాన్ మధ్య తలెత్తిన రెండో యుధ్ధానికి దారి తీసిందన్నారు. 2001  సెప్టెంబర్ 11 న న్యూయార్క్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద...

ఈ కరోనా మహమ్మారి ఆ ఘటనకన్నా ఘోరం.. ట్రంప్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 07, 2020 | 11:39 AM

కరోనా మహమ్మారి అమెరికాను దారుణంగా తాకిందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. 1941 లో హవాయిపై జపాన్ జరిపిన దాడిని గుర్తు చేస్తూ.., చివరకు అది అమెరికా, జపాన్ మధ్య తలెత్తిన రెండో యుధ్ధానికి దారి తీసిందన్నారు. 2001  సెప్టెంబర్ 11 న న్యూయార్క్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగిన  ఉగ్రవాద దాడిలో మూడు వేలమందికి పైగా మృతి చెందారని అన్నారు. ఆ సంఘటనల కన్నా కరోనా మహమ్మారి సృష్టించిన ఈ సంఘటన ఘోరమన్నారు. ఇప్పటికే అమెరికాలో కరోనా వ్యాధికి గురై మరణించినవారి సంఖ్య 70 వేలకు పైగా పెరిగింది.