AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్రమార్కులకు మోదీ అండ.. విషయం తెలిస్తే షాక్ !

రాజకీయాలన్నాక అవినీతి ఆరోపణలు షరామామూలే. కానీ ప్రధాని నరేంద్ర మోదీపై ఇప్పటి వరకు వచ్చిన అవినీతి ఆరోపణలు ఎక్కువగా ప్రజల్లో విశ్వసనీయతను పొందలేకపోయాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాఫెల్ యుద్ద విమానాల కోనుగోలులో చౌకీ దార్ చోర్ హై అంటూ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని మరీ దేశమంతా తిరిగి చెప్పినా నరేంద్ర మోదీకి అవినీతిని ఆపాదించలేకపోయారు. అయితే.. తాజా ఉదంతం మాత్రం మోదీ అక్రమార్కులకు కొమ్ము కాసేలా వుంది. […]

అక్రమార్కులకు మోదీ అండ.. విషయం తెలిస్తే షాక్ !
Rajesh Sharma
|

Updated on: Oct 23, 2019 | 4:52 PM

Share

రాజకీయాలన్నాక అవినీతి ఆరోపణలు షరామామూలే. కానీ ప్రధాని నరేంద్ర మోదీపై ఇప్పటి వరకు వచ్చిన అవినీతి ఆరోపణలు ఎక్కువగా ప్రజల్లో విశ్వసనీయతను పొందలేకపోయాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాఫెల్ యుద్ద విమానాల కోనుగోలులో చౌకీ దార్ చోర్ హై అంటూ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని మరీ దేశమంతా తిరిగి చెప్పినా నరేంద్ర మోదీకి అవినీతిని ఆపాదించలేకపోయారు.

అయితే.. తాజా ఉదంతం మాత్రం మోదీ అక్రమార్కులకు కొమ్ము కాసేలా వుంది. ఏకంగా కేంద్ర కేబినెట్‌లో బుధవారం తీసుకున్న నిర్ణయం అక్రమార్కులకు మోదీ అండగా నిలుస్తున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా వున్న ఈ అక్రమార్కులు ఒక్కరూ.. ఇద్దరో  లేక పది మందో కాదు.. ఏకంగా 40 లక్షల మంది అక్రమార్కులకు ప్రదాని నరేంద్ర మోదీ అండగా నిలుస్తూ కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

షాక్ గురవుతున్నారా ? ఎస్.. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ దేశ రాజధానిలో అక్రమంగా చిన్నా చితకా నివాస గృహాలు.. గుడిసెలు.. రేకుల ఇళ్ళు కట్టుకుని నివసిస్తున్న సుమారు 40 లక్షల మంది నివాసాలను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. ఏకంగా 40 లక్షల మంది జీవితాల్లో ఆనందం వెల్లి విరిసే నిర్ణయాన్ని మోదీ సర్కార్ తీసుకుంది.

అయితే వీరంతా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నివసిస్తున్నవారే. కానీ వారిని ఉన్నపళంగా అక్కడ్నించి తరిమేయకుండా.. వారంతా అక్రమంగా నివసిస్తున్న వారైనా.. వారంతా అక్రమంగా భూములు ఆక్రమించుకుని నివాస ఆవాసాలను ఏర్పాటు చేసుకున్న వారైనా.. మానవతా దృక్పథంతో వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఈరకంగా నరేంద్ర మోదీ అక్రమార్కులకు అండగా నిలచినట్లయ్యారు.

మరో 6 నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో మోదీ సర్కార్ ఏకంగా 40 లక్షల మంది నిరుపేదలకు వారుంటున్న ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగున్నట్లు సుస్పష్టంగా కనిపిస్తోంది. అక్రమంగా నివసిస్తున్నా వారి జీవన స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం వారందరి నివాస గృహాలను, వారుంటున్న భూములను రెగ్యులరైజ్ చేయబోతోంది. సో.. డబుల్ ధమాకా అంటే ఇదేనేమో.. !

Follow Us
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?