AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking సూరత్ నగరంలో అల్లర్లు

దేశంలో నెలా 15 రోజులుగా కొనసాగుతున్న లాక్ డౌన్ చివరికి అల్లర్లకు దారితీస్తోంది. సరైన ఉపాధి లేక.. యాజమాన్యాలు వేతనాలు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్న వలస కార్మికులు తమను నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్న పోలీసులపై ఆక్రోశాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో..

Breaking సూరత్ నగరంలో అల్లర్లు
Rajesh Sharma
|

Updated on: May 04, 2020 | 4:06 PM

Share

దేశంలో నెలా 15 రోజులుగా కొనసాగుతున్న లాక్ డౌన్ చివరికి అల్లర్లకు దారితీస్తోంది. సరైన ఉపాధి లేక.. యాజమాన్యాలు వేతనాలు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్న వలస కార్మికులు తమను నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్న పోలీసులపై ఆక్రోశాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో సోమవారం మధ్యాహ్నం అల్లర్లు చెలరేగాయి.

సూరత్ నగరంలోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వేలాది సంఖ్యలో కార్మికులు ఉండడంతో వారందరినీ ఒకేసారి తరలించడం మంచిది కాదని గుజరాత్ ప్రభుత్వం భావించింది. దశలవారీగా వారిని వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ లోగా తమకు సరైన తిండి దొరకడం లేదని, చేతుల్లో డబ్బులు కూడా లేవని కార్మికులు ఆందోళనకు దిగారు.

తమ దారి తమను చూసుకోనిస్తే ఎలాగోలా తమ స్వస్థలాలకు చేరిపోతామంటూ వలస కార్మికులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. దాంతో సూరత్ వీథులు సోమవారం మధ్యాహ్నం రక్త సిక్తమయ్యాయి. వారిని నియంత్రించడానికి ప్రయత్నించిన పోలీసులపై వలస కార్మికులు రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులకు వారికి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులపై రాళ్లు రువ్వారు వలస కార్మికులు.

కేంద్ర ప్రభుత్వం వందల సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపుతూ తమను తమ స్వస్థలాలకు పంపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి నిరోధిస్తుందని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దశలవారీగా వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, అదే సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనలల్లో క్రమంగా సడలింపులు ఇస్తుండడంతో పరిశ్రమలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారని పోలీసులు చెబుతున్నారు. కార్మికులు ఆందోళన చెందవద్దని గుజరాత్ ప్రభుత్వం కోరింది.

Follow Us
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?
అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!