AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మపిలుపుతో ప్రాణం పోసుకున్నాడు..

అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన తర్వాత.. అమ్మ పిలుపుతో కుమారుడు లేచిన ఘటన సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రిలో చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు తమకిక లేకుండా పోతున్నాడని ఆ తల్లి తల్లడిల్లింది. విలపిస్తూనే ఆ కుమారుడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. అమ్మ విలపిస్తున్న ఆ శబ్ధానికి ఆ కొడుకు కళ్ళలోంచి నీళ్లు కారడాన్ని గుర్తించిన స్థానికులు ఆర్‌ఎంపీని పిలిపించి నాలుగైదు రోజులు వైద్యం అందించారు. దీంతో స్పృహలోకి వచ్చిన అతడు మాట్లాడటం ప్రారంభించాడు. అమ్మ ప్రేమే పునర్జన్మ నిచ్చిందని […]

అమ్మపిలుపుతో ప్రాణం పోసుకున్నాడు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 08, 2019 | 1:40 PM

Share

అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన తర్వాత.. అమ్మ పిలుపుతో కుమారుడు లేచిన ఘటన సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రిలో చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు తమకిక లేకుండా పోతున్నాడని ఆ తల్లి తల్లడిల్లింది. విలపిస్తూనే ఆ కుమారుడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. అమ్మ విలపిస్తున్న ఆ శబ్ధానికి ఆ కొడుకు కళ్ళలోంచి నీళ్లు కారడాన్ని గుర్తించిన స్థానికులు ఆర్‌ఎంపీని పిలిపించి నాలుగైదు రోజులు వైద్యం అందించారు. దీంతో స్పృహలోకి వచ్చిన అతడు మాట్లాడటం ప్రారంభించాడు. అమ్మ ప్రేమే పునర్జన్మ నిచ్చిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

పిల్లలమర్రి గ్రామానికి చెందిన సైదమ్మకు ఇద్దరు కుమారులు. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడంతో తానే ఇంటి పెద్ద అయి పిల్లలిద్దరిని చదివించుకుంటోంది. చిన్న కుమారుడు కిరణ్‌కు జూన్ 26న వాంతులు, విరేచనాలు కావడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు వైద్యం అందించిన డాక్టర్లు పరిస్థితి విషమించిందని.. బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపారు. వెంటిలేటర్ తీస్తే చనిపోతాడని చెప్పి డిశ్చార్జ్ చేశారు. సమాచారం అందుకున్న బంధుమిత్రులు అంత్యక్రియలు చేసేందుకు గ్రామంలో ఏర్పాట్లు చేశారు. తన కొడుకు ఇక లేడని తల్లి సైదమ్మ గట్టిగా ఏడవడంతో.. ఆ పిలుపుకు అతడి కంట నుంచి నీరు కారింది. దీంతో కిరణ్‌ను ఆస్పత్రిలో జాయిన్ చేసి.. చికిత్స అందించారు. చనిపోయాడు అనుకున్న కొడుకు బతకడంతో.. కుటుంబసభ్యులతోపాటు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం