AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీకి షాకిచ్చిన కృష్ణా రివర్ బోర్డు

కృష్ణా నదీ జలాల వినియోగం, భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో ఒకవైపు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు పోరాట పంథాలో సాగుతుండగా.. కృష్ణా రివర్ బోర్డు ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చింది.

ఏపీకి షాకిచ్చిన కృష్ణా రివర్ బోర్డు
Rajesh Sharma
|

Updated on: May 19, 2020 | 4:41 PM

Share

Krishna river management board shocks andhra government: కృష్ణా నదీ జలాల వినియోగం, భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో ఒకవైపు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు పోరాట పంథాలో సాగుతుండగా.. కృష్ణా రివర్ బోర్డు ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చింది. పోతిరెడ్డిపాడు వద్ద రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుకునేందుకు ప్రణాళిక రచిస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే కృష్ణా జలాలను అదనంగా డ్రా చేసుకుంటున్నారని, దానిని తక్షణం ఆపాలని కృష్ణా రివర్ బోర్డు తాఖీదు పంపింది. ఈ మేరకు ఏపీ ఇంజనీర్-ఇన్-చీఫ్‌కు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఛైర్మెన్ మంగళవారం లేఖ రాశారు.

Read full letter:   Lr to ENCs dt.19.05.2020

శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను డ్రా చేసుకునేందుకు ఉద్దేశించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, తాజాగా ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు పోరాట పంథాను అనుసరిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిర్మించిన పలు ప్రాజెక్టులపై ఏపీ ఒకేసారి కృష్ణా, గోదావరి రివర్ బోర్డులకు ఫిర్యాదు చేసింది. ఇంకోవైపు కృష్ణా నదిలో నీళ్ళు లేవంటూ.. గోదావరి జలాలను వాడుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ప్రభుత్వానికి స్నేహపూర్వకంగా సూచించారు.

అయితే, రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్న తరునంలో కృష్ణా రివర్ బోర్డు ఏపీకి షాకిస్తూ సడన్‌గా లేఖ రాసింది. కేటాయించిన దానికంటే ఎక్కువగా కృష్ణా నదీ జలాలను వాడుకుంటున్నారంటూ ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు లేఖ రాసింది. సాగర్ కుడి కాలువ, హంద్రీనీవా, ముచ్చుమర్రి నుంచి ఎక్కువ నీటిని ఏపీ వాడుకుంటోందని, ఇకనైనా నీటి వాడకాన్ని నిలిపివేయాలని ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ శాఖకు మంగళవారం పంపిన లేఖలో కృష్ణా రివర్ బోర్డ్ ఛైర్మెన్ పేర్కొన్నారు.

Follow Us
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరిన మోదీ
బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరిన మోదీ
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!