మళ్ళీ తెరమీదికి రాయల తెలంగాణ ?

ఆరేళ్ళ క్రితం నాటి మాట… కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక తెలంగాణ డిమాండ్ పై 2009 నుంచి చేస్తున్న జాప్యానికి తెర దించేందుకు ఉపక్రమించిన సమయం అది. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమా ? హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయడమా ? లేక రాయలసీమలోని అనంతపురం, కర్నూల్ జిల్లాలను తెలంగాణకు కలిపి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, చిత్తూరు, కడప జిల్లాలను […]

మళ్ళీ తెరమీదికి రాయల తెలంగాణ ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 19, 2019 | 2:36 PM

ఆరేళ్ళ క్రితం నాటి మాట… కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక తెలంగాణ డిమాండ్ పై 2009 నుంచి చేస్తున్న జాప్యానికి తెర దించేందుకు ఉపక్రమించిన సమయం అది. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమా ? హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయడమా ? లేక రాయలసీమలోని అనంతపురం, కర్నూల్ జిల్లాలను తెలంగాణకు కలిపి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, చిత్తూరు, కడప జిల్లాలను కోస్తాఆంధ్ర లోని మిగిలిన 9 జిల్లాలకు కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం… ఇలాంటి రకరకాల ఆలోచనలు చేస్తున్న తరుణంలో తెరమీదికొచ్చిన ప్రతిపాదనలు సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో విస్తృత స్థాయిలో చర్చకు దారి తీశాయి. రాయల తెలంగాణకు సీమాంధ్రలోని బలమైన నేతలంతా ఓకే అన్నారు. హైదరాబాద్ కు చెందిన అసదుద్దీన్ ఒవైసి లాంటి వారు కూడా రాయల తెలంగాణ ప్రతిపాదనకు ఓకే అన్నారు. అయితే ఈ ప్రతిపాదనకు కెసిఆర్ సహా హార్డ్ కోర్ తెలంగాణ వాదులు విముఖంగా ఉండడంతో రాష్ట్రాన్ని విభజించినా కూడా రాజకీయంగా ఉపయోగం ఉండదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అప్పట్లో రాయల తెలంగాణ ప్రతిపాదనను పక్కన పెట్టి.. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగిస్తూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో రాయల తెలంగాణ అంశం క్రమంగా తెరమరుగైపోయింది. అయితే తాజాగా ఈ ప్రతిపాదన మళ్ళీ వెలుగులోకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ చర్చకు తెరలేపింది.

సమైక్య ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పాటైన ఆంధ్ర ప్రదేశ్ కు కర్నూల్ ని రాజధానిగా చేయాలని కొందరు సీమ నేతలు డిమాండ్ చేసినా అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు అస్సలు ఖాతరు చేయలేదు. తాను స్వతహాగా గా సీమ ప్రాంతానికి చెందిన నాయకుడే అయినా కర్నూల్ ని రాజధాని చేసే అంశాన్ని పట్టించుకోకుండా అమరావతిని కొత్త రాజధాని గా ఎంపిక చేయడమే కాకుండా వరల్డ్ క్లాస్ కాపిటల్ గా దాన్ని డెవలప్ చేయెందుకు ప్రయత్నించారు. అయితే ఐదేళ్ల కాలంలో రాజధాని నిర్మాణంలో పెద్దగా అడుగులు ముందుకు పడకపోవడంతో ఇటీవలే సీఎంగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో భిన్న మైన వైఖరి తీసుకున్నారు. కోర్ కాపిటల్ ప్రాంతాన్ని తరలిస్తారన్న పుకార్లకు వైసీపీ నేతలు బొత్స వంటి వారి కామెంట్లు దోహదం చేసాయి. ఈ క్రమంలో రాయల సీమ నేతల్లో మరోసారి కర్నూల్ కు ప్రాధాన్యత పెంచాలన్న ఆశ పుట్టింది. కర్నూల్ ని రెండో రాజధానిగా చేయాలని, కర్నూల్ లో హై కోర్ట్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ వంటి నేతలు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. తాజాగా అధికార వైసీపీ కి చెందిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని ఏకంగా “రాయల తెలంగాణ” ఏర్పాటు కావాలన్నా డిమాండ్ ని ప్రస్తావించడంతో మరో సారి ఈ అంశం చర్చల్లోకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటై ఐదేళ్లు పూర్తైన తరుణంలో కాటసాని ప్రస్తావిస్తున్న రాయల తెలంగాణ అంశం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. స్వంత పార్టీ నుంచి వినిపించిన ఈ రాయల తెలంగాణ ప్రతిపాదన ముఖ్యమంత్రి జగన్ కు కొంత ఎంబర్రస్మెంట్ గానే ఉన్నా.. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి ఈ అంశంపై గుంభనంగానే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా తెరమీదికొచ్చిన ఈ అంశంపై కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఉవ్విళ్ళూరుతున్న కమల నాథులు.. తమకు రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుంది అంటే రాయల తెలంగాణ అంశాన్ని పరిశీలించే అవకాశమూ లేకపోలేదు. ఆంతరంగిక సమావేశాల్లో, సమాలోచనల్లో టిజి వెంకటేష్ లాంటి నేతలు చేస్తున్న నర్మగర్భ వ్యాఖ్యలు రాయల తెలంగాణ వాదనకు బలం చేకూరుసున్నాయి. అయితే ఎటొచ్చి ఈ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించే నేతలు రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న తరుణంలో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం దాదాపు అసాధ్యమే చెప్పాలి.

అలాంటివాళ్లకు ఇండస్ట్రీ సేఫ్ కాదు.. హీరోయిన్ ప్రీతీ జింటా ..
అలాంటివాళ్లకు ఇండస్ట్రీ సేఫ్ కాదు.. హీరోయిన్ ప్రీతీ జింటా ..
వర్షాలు, భూకంపాలు వస్తే వాహన బీమా వస్తుందా..?
వర్షాలు, భూకంపాలు వస్తే వాహన బీమా వస్తుందా..?
బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..
బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..
కరివేపాకుతో జుట్టు మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
కరివేపాకుతో జుట్టు మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
కారు టైర్లు పేలిపోవడానికి కారణం ఏంటి.. ఈ జాగ్రత్తలతో జర్నీ సేఫ్
కారు టైర్లు పేలిపోవడానికి కారణం ఏంటి.. ఈ జాగ్రత్తలతో జర్నీ సేఫ్
ఎన్ఆర్ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
ఎన్ఆర్ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు