AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్ళీ తెరమీదికి రాయల తెలంగాణ ?

ఆరేళ్ళ క్రితం నాటి మాట… కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక తెలంగాణ డిమాండ్ పై 2009 నుంచి చేస్తున్న జాప్యానికి తెర దించేందుకు ఉపక్రమించిన సమయం అది. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమా ? హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయడమా ? లేక రాయలసీమలోని అనంతపురం, కర్నూల్ జిల్లాలను తెలంగాణకు కలిపి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, చిత్తూరు, కడప జిల్లాలను […]

మళ్ళీ తెరమీదికి రాయల తెలంగాణ ?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Sep 19, 2019 | 2:36 PM

Share

ఆరేళ్ళ క్రితం నాటి మాట… కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక తెలంగాణ డిమాండ్ పై 2009 నుంచి చేస్తున్న జాప్యానికి తెర దించేందుకు ఉపక్రమించిన సమయం అది. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమా ? హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయడమా ? లేక రాయలసీమలోని అనంతపురం, కర్నూల్ జిల్లాలను తెలంగాణకు కలిపి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, చిత్తూరు, కడప జిల్లాలను కోస్తాఆంధ్ర లోని మిగిలిన 9 జిల్లాలకు కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం… ఇలాంటి రకరకాల ఆలోచనలు చేస్తున్న తరుణంలో తెరమీదికొచ్చిన ప్రతిపాదనలు సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో విస్తృత స్థాయిలో చర్చకు దారి తీశాయి. రాయల తెలంగాణకు సీమాంధ్రలోని బలమైన నేతలంతా ఓకే అన్నారు. హైదరాబాద్ కు చెందిన అసదుద్దీన్ ఒవైసి లాంటి వారు కూడా రాయల తెలంగాణ ప్రతిపాదనకు ఓకే అన్నారు. అయితే ఈ ప్రతిపాదనకు కెసిఆర్ సహా హార్డ్ కోర్ తెలంగాణ వాదులు విముఖంగా ఉండడంతో రాష్ట్రాన్ని విభజించినా కూడా రాజకీయంగా ఉపయోగం ఉండదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అప్పట్లో రాయల తెలంగాణ ప్రతిపాదనను పక్కన పెట్టి.. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగిస్తూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో రాయల తెలంగాణ అంశం క్రమంగా తెరమరుగైపోయింది. అయితే తాజాగా ఈ ప్రతిపాదన మళ్ళీ వెలుగులోకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ చర్చకు తెరలేపింది.

సమైక్య ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పాటైన ఆంధ్ర ప్రదేశ్ కు కర్నూల్ ని రాజధానిగా చేయాలని కొందరు సీమ నేతలు డిమాండ్ చేసినా అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు అస్సలు ఖాతరు చేయలేదు. తాను స్వతహాగా గా సీమ ప్రాంతానికి చెందిన నాయకుడే అయినా కర్నూల్ ని రాజధాని చేసే అంశాన్ని పట్టించుకోకుండా అమరావతిని కొత్త రాజధాని గా ఎంపిక చేయడమే కాకుండా వరల్డ్ క్లాస్ కాపిటల్ గా దాన్ని డెవలప్ చేయెందుకు ప్రయత్నించారు. అయితే ఐదేళ్ల కాలంలో రాజధాని నిర్మాణంలో పెద్దగా అడుగులు ముందుకు పడకపోవడంతో ఇటీవలే సీఎంగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో భిన్న మైన వైఖరి తీసుకున్నారు. కోర్ కాపిటల్ ప్రాంతాన్ని తరలిస్తారన్న పుకార్లకు వైసీపీ నేతలు బొత్స వంటి వారి కామెంట్లు దోహదం చేసాయి. ఈ క్రమంలో రాయల సీమ నేతల్లో మరోసారి కర్నూల్ కు ప్రాధాన్యత పెంచాలన్న ఆశ పుట్టింది. కర్నూల్ ని రెండో రాజధానిగా చేయాలని, కర్నూల్ లో హై కోర్ట్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ వంటి నేతలు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. తాజాగా అధికార వైసీపీ కి చెందిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని ఏకంగా “రాయల తెలంగాణ” ఏర్పాటు కావాలన్నా డిమాండ్ ని ప్రస్తావించడంతో మరో సారి ఈ అంశం చర్చల్లోకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటై ఐదేళ్లు పూర్తైన తరుణంలో కాటసాని ప్రస్తావిస్తున్న రాయల తెలంగాణ అంశం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. స్వంత పార్టీ నుంచి వినిపించిన ఈ రాయల తెలంగాణ ప్రతిపాదన ముఖ్యమంత్రి జగన్ కు కొంత ఎంబర్రస్మెంట్ గానే ఉన్నా.. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి ఈ అంశంపై గుంభనంగానే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా తెరమీదికొచ్చిన ఈ అంశంపై కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఉవ్విళ్ళూరుతున్న కమల నాథులు.. తమకు రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుంది అంటే రాయల తెలంగాణ అంశాన్ని పరిశీలించే అవకాశమూ లేకపోలేదు. ఆంతరంగిక సమావేశాల్లో, సమాలోచనల్లో టిజి వెంకటేష్ లాంటి నేతలు చేస్తున్న నర్మగర్భ వ్యాఖ్యలు రాయల తెలంగాణ వాదనకు బలం చేకూరుసున్నాయి. అయితే ఎటొచ్చి ఈ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించే నేతలు రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న తరుణంలో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం దాదాపు అసాధ్యమే చెప్పాలి.

Follow Us
ఒక్కసారి చూసారంటే వెళ్లాలని అనిపించే దక్షిణాది టాప్ నేచర్..
ఒక్కసారి చూసారంటే వెళ్లాలని అనిపించే దక్షిణాది టాప్ నేచర్..
తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ఆ రోజే జెండా ఆవిష్కరించనున్న కవిత..
తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ఆ రోజే జెండా ఆవిష్కరించనున్న కవిత..
బంగారం, వెండితో పాటు పెరుగుతున్న ఈ లోహం ధరలు
బంగారం, వెండితో పాటు పెరుగుతున్న ఈ లోహం ధరలు
వెల్లుల్లిని సరైన పద్దతిలో తీసుకుంటే అమృతం.. లేదంటే విషం..
వెల్లుల్లిని సరైన పద్దతిలో తీసుకుంటే అమృతం.. లేదంటే విషం..
ఒక్క కిలోమీటర్ మంత్రం.. రోజూ నడిస్తే ఎంత కొవ్వు కరుగుతుందంటే..?
ఒక్క కిలోమీటర్ మంత్రం.. రోజూ నడిస్తే ఎంత కొవ్వు కరుగుతుందంటే..?
మోనాలిసా ఆరోపణలు ఖండించిన దర్శకుడు.. ఏమన్నారంటే..
మోనాలిసా ఆరోపణలు ఖండించిన దర్శకుడు.. ఏమన్నారంటే..
కొత్త రూపాన్ని సంతరించుకున్న కరోనా.. సికాడా వేరియంట్‌తో అలజడి
కొత్త రూపాన్ని సంతరించుకున్న కరోనా.. సికాడా వేరియంట్‌తో అలజడి
పెట్రోల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్
పెట్రోల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్
మామిడి పండ్లు మాత్రమే తింటున్నారా..? ఒక్కసారి ఈ పుడ్డింగ్ ట్రై..
మామిడి పండ్లు మాత్రమే తింటున్నారా..? ఒక్కసారి ఈ పుడ్డింగ్ ట్రై..
గ్యాస్, ఏటీఎమ్ కార్డు ఉన్నవాళ్లకు అలర్ట్.. ఏప్రిల్ 1 కొత్త రూల్స్
గ్యాస్, ఏటీఎమ్ కార్డు ఉన్నవాళ్లకు అలర్ట్.. ఏప్రిల్ 1 కొత్త రూల్స్
యూట్యూబ్‌ను ఊపేస్తున్న 'కోసింది కొయగూర' సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తున్న 'కోసింది కొయగూర' సాంగ్
లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్
లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్
ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు.. యాంకర్ ఎమోషనల్
ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు.. యాంకర్ ఎమోషనల్
ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా
ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా
సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ
సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ
పెళ్లి చేస్తానని.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
పెళ్లి చేస్తానని.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి
నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి