భారత్‌లో మరిన్ని దాడులు చేస్తాం: జైషే మహ్మద్

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బరితెగించింది. భారత్‌లో పుల్వామా ఉగ్రదాడి తరహాలో మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు మొఖానికి నల్లని ముసుగు కట్టుకుని ఒక ఉగ్రవాది భారత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అతని మాటలను వీడియో తీసి బయటకు వదిలారు. మొఖానికి నల్ల గుడ్డ కట్టుకుని ఉన్న ఆ ఉగ్రవాది వెనక జైషే మహ్మద్ పేరుతో ఒక బ్యానర్ ఉంది. అయితే పుల్వామా దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదంటూ పాక్ […]

భారత్‌లో మరిన్ని దాడులు చేస్తాం: జైషే మహ్మద్
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 7:23 PM

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బరితెగించింది. భారత్‌లో పుల్వామా ఉగ్రదాడి తరహాలో మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు మొఖానికి నల్లని ముసుగు కట్టుకుని ఒక ఉగ్రవాది భారత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అతని మాటలను వీడియో తీసి బయటకు వదిలారు. మొఖానికి నల్ల గుడ్డ కట్టుకుని ఉన్న ఆ ఉగ్రవాది వెనక జైషే మహ్మద్ పేరుతో ఒక బ్యానర్ ఉంది.

అయితే పుల్వామా దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పిన కొద్దిసేపటికే ఈ వీడియో విడుదల కావడం విశేషం. భారత్ తమపై నిందలు వేస్తుందని, ఆధారాలు చూపిస్తే విచారణ జరిపిస్తామని ఇమ్రాన్ చెప్పారు.

అయితే పుల్వామా దాడి తర్వాత కూడా జైషే మహ్మద్ ఒక వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది సీఆర్పిఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన అదిల్ మహ్మద్‌ మాట్లాడాడు. ఈ వీడియోను మీరు చూసే సరికి తాను స్వర్గంలో ఉంటానని, కశ్మీర్ కోసం పోరాటం కొనసాగాలని అందులో చెప్పాడు. కొంతమందిని చంపినంత మాత్రాన వెనకడుగు వేయమని అతను భారత్‌కు ఆ వీడియోలో హెచ్చరించాడు.

వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు