AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జులైలో భారీ ఎత్తున ఆరోగ్య సర్వే… జగన్ సంచలన నిర్ణయం

ఏపీవ్యాప్తంగా సమగ్ర ఆరోగ్య సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ప్రధాన రోగాలతోపాటు.. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి హెల్త్ కండీషన్‌పై సర్వే నిర్వహించి, తగిన విధంగా రికార్డులు నిర్వహించి, ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి తలపెట్టారు.

జులైలో భారీ ఎత్తున ఆరోగ్య సర్వే... జగన్ సంచలన నిర్ణయం
Rajesh Sharma
|

Updated on: Apr 23, 2020 | 3:55 PM

Share

ఏపీవ్యాప్తంగా సమగ్ర ఆరోగ్య సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ప్రధాన రోగాలతోపాటు.. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి హెల్త్ కండీషన్‌పై సర్వే నిర్వహించి, తగిన విధంగా రికార్డులు నిర్వహించి, ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి తలపెట్టారు. ఈ మేరకు గురువారం జరిగిన వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. కరోనా ప్రభావం మొదలైన తర్వాత రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించారు.

తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్‌ లాంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం వైద్యశాఖను ఆదేశించారు. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని చెప్పారు. 104కు కాల్‌చేస్తే వెంటనే స్పందించేలా ఉండాలన్న సీఎం.. ఎమర్జెన్సీ కేసులకు ఇబ్బంది రాకుండా ప్లాన్ చేయాలన్నారు. డెలివరీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలని, ప్రతిపాదిత కొత్త మెడికల్‌ కాలేజీలకు వెంటనే స్థలాలను గుర్తించాలని ముఖ్యమంత్రి వైద్య శాఖ అధికారులకు తెలిపారు.

ఎవరికి ఏ సమస్య ఉన్నా 1902కు కాల్‌ చేయాలని సీఎం ఏపీ ప్రజలకు సూచించారు. గ్రామాల్లోని రైతులు అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ను సంప్రదించాలని, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ద్వారా పంటలు పరిస్థితులు, ధరల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించవచ్చని తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందన్నారు.