AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్లమెంటు సెషన్‌కు కరోనా బ్రేక్!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు కరోనా వైరస్ వ్యాప్తి బ్రేక్ వేసే పరిస్థితి కనిపిస్తోంది. వర్షాకాల సమావేశాలను ముందుగా అనుకున్నట్లుగా అక్టోబర్ 1వ తేదీ వరకు కాకుండా అర్ధంతరంగా ముగించే పరిస్థితి...

పార్లమెంటు సెషన్‌కు కరోనా బ్రేక్!
Rajesh Sharma
|

Updated on: Sep 19, 2020 | 1:42 PM

Share

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు కరోనా వైరస్ వ్యాప్తి బ్రేక్ వేసే పరిస్థితి కనిపిస్తోంది. వర్షాకాల సమావేశాలను ముందుగా అనుకున్నట్లుగా అక్టోబర్ 1వ తేదీ వరకు కాకుండా అర్ధంతరంగా ముగించే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు పార్లమెంటు సెషన్ కొనసాగుతుండగా.. మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగాన్ని పుంజుకుంది. ఇందులో భాగంగా పలువురు పార్లమెంటు సభ్యులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు లోక్ సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు కరోనా కాటుతో మృత్యువు పాలయ్యారు. దాంతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సెషన్‌ను కుదించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

గత మార్చి నెలలో మొదలైన కరోనా వ్యాప్తి ప్రస్తుతం దేశంలో శరవేగాన్ని పుంజుకుంది. ప్రతి రోజు 90 వేలకు పైగా కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. గురు, శుక్రవారాల్లో వరుసగా 95 వేలు, 96 వేల చొప్పున కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా వైరస్ బారిన పడుతున్న పార్లమెంటు సభ్యుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 30 మంది ఎంపీలకు, పలువురు కేంద్ర మంత్రులకు కరోనా వైరస్ సోకింది. పదుల సంఖ్యలో పార్లమెంటు సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. మరోవైపు ముగ్గురు ఎంపీలు కరోనా సోకి మరణించారు.

ఈ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం పలు రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని సేకరించే పనిని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిబ్బంది చేపట్టినట్లు సమాచారం. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 14వ తేదీన మొదలైన వర్షాకాల సమావేశాలు.. అక్టోబర్ 1వ తేదీ వరకు కొనసాగాల్సి వుంది. తాజా పరిణామాల నేపథ్యంలో అక్టోబర్ 1 కంటే ముందుగానే సెషన్‌ను ముగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..