ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు

అమరావతి: బుధవారం ఉదయం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. అలాగే పలు నిర్ణయాలను కూడా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటుతో పాటు డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, సిమ్ కార్డుతోపాటు మూడేళ్ల పాటు కనెక్టివిటి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే అమరావతిలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు 30 ఎకరాలు కేటాయింపు, ఎకరాకు రూ.10 లక్షల చొప్పున 30 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయించారు. కాగా.. తొలి విడత రూ. […]

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 08, 2020 | 8:16 PM

అమరావతి: బుధవారం ఉదయం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. అలాగే పలు నిర్ణయాలను కూడా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటుతో పాటు డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, సిమ్ కార్డుతోపాటు మూడేళ్ల పాటు కనెక్టివిటి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే అమరావతిలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు 30 ఎకరాలు కేటాయింపు, ఎకరాకు రూ.10 లక్షల చొప్పున 30 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయించారు. కాగా.. తొలి విడత రూ. కోటి సీఆర్డీఏకు చెల్లిస్తే సొసైటీకి భూమి బదలాయించేలా నిర్ణయించారు. మిగతా మొత్తం రెండేళ్లలో సీఆర్డీఏకి చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. అలాగే ఎన్జీఓలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ.. చదరవు గజం రూ.4 వేల చొప్పున 230 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది.