జగన్‌ను కలిసిన ఆమంచి

TV9 Telugu Digital Desk

Updated on: Feb 13, 2019 | 12:21 PM

హైదరాబాద్: ఈ ఉదయం టీడీపీకి రాజీనామా చేసిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తాజాగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసిన ఆమంచి ఆ పార్టీలో చేరే అంశంపై చర్చిస్తున్నారు. మరోవైపు టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం మాట్లాడిన ఆమంచి.. చంద్రబాబుపై విమర్శలు కురిపించారు. ప్రజల సమస్యలపై పోరాడే నాయకులకు టీడీపీలో స్థానం లేదని.. ప్రజల డబ్బును చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన తరువాత తాను వైసీపీలోకి వెళ్లేందుకు […]

జగన్‌ను కలిసిన ఆమంచి

హైదరాబాద్: ఈ ఉదయం టీడీపీకి రాజీనామా చేసిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తాజాగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసిన ఆమంచి ఆ పార్టీలో చేరే అంశంపై చర్చిస్తున్నారు. మరోవైపు టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం మాట్లాడిన ఆమంచి.. చంద్రబాబుపై విమర్శలు కురిపించారు. ప్రజల సమస్యలపై పోరాడే నాయకులకు టీడీపీలో స్థానం లేదని.. ప్రజల డబ్బును చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన తరువాత తాను వైసీపీలోకి వెళ్లేందుకు పూనుకున్నానని.. వీలైనంత త్వరలోనే ఆ పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu