ఏజ్ బారా..? ఓటేసేశాం
దేశవ్యాప్తంగా మూడో దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా తమ వయసును పక్కనపెట్టి పోలింగ్ బూత్కు వచ్చి అందరినీ ఉత్సాహపరుస్తున్నారు కొందరు వృద్ధులు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో వృద్ధ దంపతులు ప్రభాకర్ భీడే(93), సుషీలా భీడే(88) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుణేలోని మయూర్ కాలనీలో […]
దేశవ్యాప్తంగా మూడో దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా తమ వయసును పక్కనపెట్టి పోలింగ్ బూత్కు వచ్చి అందరినీ ఉత్సాహపరుస్తున్నారు కొందరు వృద్ధులు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో వృద్ధ దంపతులు ప్రభాకర్ భీడే(93), సుషీలా భీడే(88) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుణేలోని మయూర్ కాలనీలో ఈ ఇద్దరు ఓటేశారు.
Maharashtra: A senior citizen couple, 93-year-old Prabhakar Bhide and 88-year-old Sushila Bhide cast their votes at a polling booth in Pune's Mayur colony. #LokSabhaElections2019 pic.twitter.com/4xT4Qoo8LR
— ANI (@ANI) April 23, 2019