వసంత్ కొల్లిమర్ల,2017 లో ఎలక్ట్రానిక్ మీడియాలో అడుగు పెట్టాను.AP24/7, MAHA NEWS,HMTV, న్యూస్ చానల్స్,INDIA HERALD WEB SITE లో పని చేసిన అనుభవం ఉంది.విజయవాడ శాతవాహన కళాశాలలో డిగ్రీ వరకు చదువుకున్న నేను , డిగ్రీ పూర్తయిన తరువాత ఎంబీఏ డిస్ కంటిన్యు చేసి ట్రైనీ రిపోర్టర్గా AP24/7లో జాయిన్ అయ్యాను, జర్నలిజం కెరియర్లో,లైఫ్ స్టైల్, క్రైమ్, పోలిటీకల్ బీట్స్లో స్టాఫ్ రిపోర్టర్గా విజయవాడ , హైదరాబాద్లో పని చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కోనసీమ అల్లర్లు,కందుకూరు తొక్కిసలాట, గోదావరి జిల్లాల్లో వరదలు, కృష్ణా వరదలు,గోదావరిలో బోటు మునక కృష్ణా నదిలో బోటు మునక, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ,వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్ యాత్ర, హై కోర్టులో కీలక కేసులతో పాటు , చంద్రబాబు నాయుడుపై వచ్చిన ఆరోపణల స్కిల్ స్కాం కేసులతో పాటు, వైసీపీ ప్రభుత్వంలో ఆరోపణలు వచ్చిన లిక్కర్ స్కాం కేసులు, 2019,2024 ఎన్నికల కవరేజ్లో పాల్గొన్నాను.2023లో టీవీ9లో రిపోర్టర్గా జాయిన్ అయ్యాను.
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఉచిత బస్సులో డ్యూటీ చేస్తున్న పాపానికి దెబ్బలు తిన్నాడు ఓ కండక్టర్. ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళను టికెట్ తీసుకోవాలని చెప్పినందుకు కండక్టర్ చంప పగలగొట్టిన ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది.. విజయవాడలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో, స్థానిక వార్తల్లో హాట్ టాపిక్గా మారింది. ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత కండక్టర్లకు, మహిళా ప్రయాణికులకు మధ్య జరుగుతున్న వరుస ఘర్షణల్లో ఇది మరొకటి.
- Vasanth Kollimarla
- Updated on: Apr 7, 2026
- 9:25 am
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ..!
ప్రేమకు ఎత్తు, అందం, ఆస్తి వంటి హద్దులు లేవని మచిలీపట్నంకు చెందిన ఒక యువతి ఆదర్శ వివాహం ద్వారా చాటిచెప్పింది. అయితే, వీరి వివాహానికి కులమత భేదాలు, శారీరక వ్యత్యాసాల కారణంగా పెద్దల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రాణహాని ఉందని భావించిన ఈ జంట వివాహం చేసుకుని, రక్షణ కోసం ఇనుకుదురుపేట పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన ద్వారా నిజమైన ప్రేమకు బాహ్య సౌందర్యం అవసరం లేదని మరోసారి స్పష్టమైంది. ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
- Vasanth Kollimarla
- Updated on: Apr 7, 2026
- 8:47 am
Uyyuru: వృద్ధులకు ఫేక్ పోలీస్ వీడియో కాల్.. ఒక్కసారిగా ఎంటరయిన రియల్ ఖాకీ.. కట్ చేస్తే
రిటైర్డ్ వృద్ధులను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు భయపెట్టి డబ్బులు దోచుకునే ప్రయత్నం కృష్ణా జిల్లా ఉయ్యూరులో విఫలమైంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పేరుతో వీడియో కాల్ చేసి సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ అయిందని నమ్మబలికే ప్రయత్నం చేసిన మోసగాళ్లను స్థానిక పోలీసుల చాకచక్యంతో బట్టబయలు చేశారు.
- Vasanth Kollimarla
- Updated on: Feb 20, 2026
- 7:29 pm
బుర్ఖా ధరించి ఆటో డ్రైవర్ చైన్ స్నాచింగ్.. కట్ చేస్తే సీన్ సితార్!
ఓ కన్నింగ్ కేటుగాడు ఆడ వేషంలో స్కూటీపై వచ్చి వృద్ధురాలి మెడలో బంగారం గొలుసు కాజేశాడు. రోడ్డుపై చైన్ స్నాచింగ్కు పాల్పడిన సంఘటన విజయవాడ లో కలకలం రేపింది. విజయవాడ నగర శివారు నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడా కాలనీకి చెందిన ఓ వృద్ధురాలు ఇంటి ముందు కూర్చుని ఉంది. అదే సమయంలో..
- Vasanth Kollimarla
- Updated on: Jan 21, 2026
- 5:49 pm
Andhra Pradesh: సినిమా రేంజ్ మిస్టరీ.. తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కాల్ రికార్డ్.. 9 నెలల తర్వాత..
నేరం ఎంత పక్కాగా చేసినా.. ఏదో ఒక చిన్న ఆధారం నిందితులను కటకటాల వెనక్కి నెడుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కన్న తల్లి చనిపోతే గుండెపోటు అనుకుని అంతా కన్నీరు మున్నీరయ్యారు.. తండ్రి కూడా ఏమీ తెలియనట్టు అంత్యక్రియలు పూర్తి చేశాడు. కానీ 9 నెలల తర్వాత బయటపడిన ఒకే ఒక్క ఫోన్ కాల్ రికార్డింగ్ ఆ ఇంట్లోని భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. అదేంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
- Vasanth Kollimarla
- Updated on: Jan 18, 2026
- 7:40 am
Andhra: ఇద్దరు వ్యక్తులు, 8 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు.. హాస్టల్ గోడ దూకి.. సీన్ కట్ చేస్తే.!
8వ తరగతి చదువుతున్న 26 మంది విద్యార్థులు చికెన్ బిరియాని తిన్నారని క్రమశిక్షణ చర్యల పేరుతో ప్రిన్సిపాల్ విద్యార్థులను చితకబాదారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలూరు గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయం హాస్టల్లో విద్యార్థులు రెండుసార్లు బయట వ్యక్తుల ద్వారా బిరియాని ప్యాకెట్స్ని..
- Vasanth Kollimarla
- Updated on: Nov 30, 2025
- 11:06 am
Penuganchiprolu: మటన్ పెట్టలేదని.. తిరుపతమ్మ ఆలయం వద్ద భక్తులపై యాచకుల దాడి
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులపై యాచకులు దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. తమకు మాంసాహార భోజనం పెట్టలేదన్న కోపంతో యాచకులు భక్తులపై దాడికి తెగబడినట్లు సమాచారం. ఈ దాడిలో నలుగురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
- Vasanth Kollimarla
- Updated on: Nov 28, 2025
- 3:58 pm
Vijayawada Crime: విడాకులు ఇవ్వలేదనీ.. రోడ్డుపై వెంటాడి భార్యను హత్య చేసిన భర్త! ఆ తర్వాత సీన్ ఇదే
Man stabs wife to death in broad daylight at Suryaraopet: సూర్యరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో భార్యను దారుణంగా హత్య చేశాడు విజయ్ అనే వ్యక్తి. నూజివీడుకు చెందిన స్టాఫ్ నర్స్ సరస్వతి, విజయవాడకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ ఇద్దరు 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు..
- Vasanth Kollimarla
- Updated on: Nov 14, 2025
- 3:15 pm
Andhra: అలా ఎలా మోసపోయావ్ పోలీసన్న.. ఫోన్ చేశారని జస్ట్ లింక్ క్లిక్ చేశాడు.. కొన్ని సెకన్లలోనే..
అతనో పోలీస్.. మళ్లీ ఏఎస్ఐ.. ఆయనకు అన్నీ తెలుసు.. సైబర్ క్రైం గురించి అవగాహన కూడా ఉంది.. మోసాల గురించి తరచూ చెబుతుంటారు.. కానీ.. ఆయనే మోసపోయి లబోదిబోమంటున్నారు. పోలీసులు దొంగలకు చుక్కలు చూపిస్తుంటే.. సైబర్ క్రిమినల్స్ పోలీసులకు చుక్కలు చూపించిన ఘటన విజయవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- Vasanth Kollimarla
- Updated on: Oct 30, 2025
- 9:45 am
Jaggaiahpet: సైకిల్పై వెళ్తూ ఒక్కసారిగా కింద పడ్డ బాలుడు.. స్థానికులు వెళ్లి లేపే ప్రయత్నం చేయగా.
జగ్గయ్యపేటలో పదవ తరగతి విద్యార్థి వెంకట్ గణేష్ హార్ట్స్ట్రోక్తో చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది. ఉదయం ట్యూషన్కు వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొంతకాలం క్రితం తండ్రి మృతి చెందగా, ఇప్పుడు కొడుకు కూడా ... ...
- Vasanth Kollimarla
- Updated on: Oct 24, 2025
- 6:35 pm
పెళ్లి చేస్తామంటూ ప్రేమ జంటను పోలీస్ స్టేషన్కు పిలిచిన అమ్మాయి తండ్రి.. ఇంతలోనే షాక్!
మైలవరం పట్టణానికి చెందిన చింతల వెంకటయ్య తన కుమార్తె డిగ్రీ పూర్తి చేయడంతో మంచి ఉద్యోగం సాధించి ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశ్యంతో విజయవాడలో బ్యాంక్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్న తమ కుమార్తె హైదరాబాద్కు చెందిన యువకుడితో ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
- Vasanth Kollimarla
- Updated on: Oct 23, 2025
- 8:39 pm
Vijayawada: ‘నా ఫోటో ఏ పోలీస్ స్టేషన్కి అయినా పంపు.. వారికే దడ పుడుతుంది’.. కండక్టర్కు మహిళ వార్నింగ్
జగ్గయ్యపేట డిపో బస్సులో మహిళా ప్రయాణికురాలి హంగామా చేసింది విజయవాడ-పెనుగంచిప్రోలు రూట్లో బస్సులో ఆమె చేసిన హడావిడి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సు డ్రైవర్, కండక్టర్ సూచనలను పట్టించుకోకుండా.. వారికే తిరిగి వార్నింగ్ ఇచ్చింది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి..
- Vasanth Kollimarla
- Updated on: Oct 16, 2025
- 7:57 pm