AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: వైసీపీపై టీడీపీ దాడులకు దిగుతోంది.. గవర్నర్‌కు పేర్ని నాని ఫిర్యాదు

ఏపీలో పోలింగ్‌ రోజున మొదలైన రచ్చ.. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా ఆగడం లేదు. కూటమి అఖండ విజయం సాధించడం.. వైసీపీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకోవడం.. ఒక్కసారిగా రాజకీయవాతావరణాన్ని మార్చేసింది. అధికారంలోకి వచ్చీరాగానే తమపై టీడీపీవాళ్లు దాడులు చేస్తున్నారంటూ.. వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ..

AP News: వైసీపీపై టీడీపీ దాడులకు దిగుతోంది.. గవర్నర్‌కు పేర్ని నాని ఫిర్యాదు
Perni Nani
Subhash Goud
|

Updated on: Jun 06, 2024 | 7:56 PM

Share

ఏపీలో పోలింగ్‌ రోజున మొదలైన రచ్చ.. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా ఆగడం లేదు. కూటమి అఖండ విజయం సాధించడం.. వైసీపీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకోవడం.. ఒక్కసారిగా రాజకీయవాతావరణాన్ని మార్చేసింది. అధికారంలోకి వచ్చీరాగానే తమపై టీడీపీవాళ్లు దాడులు చేస్తున్నారంటూ.. వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ.. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

వైసీపీ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని టీడీపీ దాడులు నిర్వహిస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ మరిన్ని దాడులకు దిగుతోందని అన్నారు. ఈ సందర్భంగా గురువారం నాని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ దాడులను అరికట్టాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ సానుభూతిపరులనే లక్ష్యంగా చేసుకుని టీడీపీ దాడులకు దిగుతోందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తమ శ్రేణులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదంటూ ప్రత్యర్థులను హెచ్చరించారు. తగిన మూల్యం చెల్లించుకుంటారనీ కూటమినేతలకు వార్నింగ్‌ ఇచ్చారు. అయితే వైసీపీ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు కూటమి నేతలు. ఓటమితో వచ్చిన ఫ్రస్టేషన్‌లో వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని రివర్స్‌ ఎటాక్‌ చేస్తున్నారు. దాడుల సంస్కృతి వైసీపీదేనని బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్‌ కౌంటర్‌ ఇచ్చారు. మరి, ఈ దాడులు, ప్రతిదాడులతో ముదురుతున్న పొలిటికల్‌ వేడి.. ఇంకే స్థాయికి చేరుకుంటుందో చూడాలి మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి