AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viveka Murder Case: సీబీఐ నోటిసులపై స్పందించిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి.. ఇప్పుడు విచారణకు హాజరుకాలేనంటూ లేఖ

దివంగత మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా సీబీఐ పంపించిన నోటీసులపై వైఎస్సార్‌ సీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి స్పందించారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని అయితే ఇప్పుడు విచారణకు హాజరుకాలేనని సీబీఐకు లేఖ రాశారు.

Viveka Murder Case: సీబీఐ నోటిసులపై స్పందించిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి.. ఇప్పుడు విచారణకు హాజరుకాలేనంటూ లేఖ
Ys Avinash Reddy
Basha Shek
|

Updated on: Jan 24, 2023 | 5:55 AM

Share

దివంగత మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా సీబీఐ పంపించిన నోటీసులపై వైఎస్సార్‌ సీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి స్పందించారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని అయితే ఇప్పుడు విచారణకు హాజరుకాలేనని సీబీఐకు లేఖ రాశారు. మంగళవారం పులివెందులలో బిజీ షెడ్యూల్‌ ఉన్నందున విచారణకు రాలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ఒక రోజు ముందుగా నోటీసు పంపారు ముందుగా అనేక కార్యక్రమాలను అరేంజ్‌ చేసుకున్నాను. 5 రోజుల తర్వాత మీరు ఎప్పుడు పిలిచినా హాజరవుతాను. మరోసారి విచారణ తేదీ తెలియజేయాలని లేఖలో కోరారు ఎంపీ. కాగా వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు సోమవారం కడప, పులివెందులకు వెళ్లారు. పులివెందుల వైసీపీ కార్యాలయానికి వెళ్లిన అధికారులు అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి కార్యాలయంతో పాటు తండ్రి భాస్కర్ ఇంట్లో సోదాలు జరిపారు. అలాగే ఎంపీ తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి గురించి ఆరా తీశారు. భాస్కర్‌రెడ్డి కార్యాలయానికి రాలేదని పార్టీ కార్యకర్తలు చెప్పడంతో వారు వెనుదిరిగారు. అనంతరం పార్టీ కార్యాలయం సమీపంలోనే ఉన్న వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి ఇంటి పరిసరాలను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది.

ఈక్రమంలోనే వివేకా హత్య కేసులో విచారణకు రావాల్సిందిగా కడప ఎంపీకి నోటీసులు జారీ చేసింది సీబీఐ. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా 2019 మార్చి 15న ఆయన ఇంట్లోని బాత్రూమ్‌లోనే వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా నరికి చంపారు దుండగులు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. వివేకా హత్య కేసు నాటి నుంచి నేటి వరకు ఎన్నో మలుపులు తిరిగింది. కోర్టు, కేసులు, దోషులు, సాక్షులు, సీబీఐ విచారణ, ఇతర రాష్ట్రాలకు కేసు బదలాయించడం ఇలా ఈ కేసులో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. వివేకా హత్య రాజకీయపరంగానూ పెను సంచలనం సృష్టించింది. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో రచ్చ రచ్చ అయ్యింది. అయితే వైఎస్ వివేకానందారెడ్డి కుమార్తె వైఎస్ సునీత అభ్యర్థన మేరకు కేసును సీబీఐకు అప్పగించింది హైకోర్టు. అప్పటి నుంచి కేసు దర్యాప్తులో పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా వైఎస్ అవినాష్‌ను ఈ కేసులో విచారించనుంచడంతో మరో కొలిక్కి తిరిగింది. అయితే ఐదు రోజుల తర్వాత విచారణకు వస్తానన్న అవినాశ్ రెడ్డి లేఖపై సీబీఐ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..