AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur District: పాపం ఆమె నమ్మి ఆటో ఎక్కింది… కానీ వాడు మాత్రం.. పొలాల్లోకి తీసుకెళ్లి

మహిళపై అత్యాచారం చేసిన ఓ ఆటోడ్రైవర్‌.. ఆమె వద్ద ఉ న్న నగదు సైతం లాక్కొని పరారయ్యాడు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో ఈ ఘటన వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలంలో ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

Guntur District: పాపం ఆమె నమ్మి ఆటో ఎక్కింది... కానీ వాడు మాత్రం.. పొలాల్లోకి తీసుకెళ్లి
Auto
Ram Naramaneni
|

Updated on: May 12, 2023 | 8:58 AM

Share

కామాంధుల బెండు తీసేందుకు ఏపీ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తుంది. దిశ యాప్ ద్వారా వారి మాన ప్రాణాలను రక్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అయినా కొందరు మహళలు..  అటవిక మనుషుల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా ఏపీలోని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో దారుణం వెలుగుచూసింది.  తన ఆటో ఎక్కిన ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం చేశారు. బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో..  కొల్లూరు మండలం క్రీస్తుపురం వెళ్లేందుకు తెనాలిలో ఆటో ఎక్కింది 35 ఏళ్ల మహిళ. మార్గం మధ్యలో మూలపాడు వద్ద ఆటోను పొలాల్లోకి తీసుకెళ్ళిన డ్రైవర్.. ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

మహిళాపై అత్యాచారం చేసి 30 వేలు నగదు తీసుకుని ఉంగారం లాక్కోని పరారయ్యాడు డ్రైవర్. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కొల్లూరు పోలీసులు. కేసును పలు కోణాల్లో విచారిస్తున్నారు. నిందితుడిపై గతంలో నేరారోపణలు ఏమైనా ఉన్నాయా..? అతడిపై ఏమైనా కేసులు ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తున్నారు. అతి త్వరలో నిందితుడ్ని పట్టుకుని.. కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అందుకే మహిళలు, యువతులు మొబైల్ ఫోన్లలో దిశ యాప్ ఇన్ స్టాల్  చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మహిళలు దిశ యాప్ బటన్ నొక్కడం ద్వారా పెను ప్రమాదాల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..