AP Politics: ఏపీలో వేడెక్కిన రాజకీయ రంగస్థలం.. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం

ఏ చిన్న దాడి జరిగినా సరే.. అది రాజకీయ రంగు పులుముకుంటోంది. దాడి చేసింది ఫలానా పార్టీ వాళ్లు.. బాధితులు తమ పార్టీ వాళ్లు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇవన్నీ రాజకీయ కక్షలే అని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం వీటిపై విచారణ జరపకుండా వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి తమమీదకు రుద్దుతూ...

AP Politics: ఏపీలో వేడెక్కిన రాజకీయ రంగస్థలం.. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం
Tdp Vs Ycp
Follow us

|

Updated on: Aug 22, 2024 | 7:37 AM

ఏపీలో రాజకీయ రంగస్థలం వేడెక్కింది. తాజా పరిణామాలపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డెవర్షన్ పాలిటిక్స్ రచ్చ రేపుతోంది. వైసీపీ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్‌ రీసౌండ్‌ ఇస్తోంది. ఏపీలో ఎన్నికల సీజన్ ఐపోయింది అనుకుంటే.. అంతకుమించి హీటెక్కించే పరిస్థితులు ఒక్కటొక్కటిగా పుట్టుకొస్తున్నాయి. తాజాగా టెంపరేచర్‌ పెంచిన పొలిటికల్ దంగల్ ఏంటంటే డైవర్షన్‌ పాలిటిక్స్‌. ప్రస్తుతం ఏపీలో హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఏ చిన్న దాడి జరిగినా సరే.. అది రాజకీయ రంగు పులుముకుంటోంది. దాడి చేసింది ఫలానా పార్టీ వాళ్లు.. బాధితులు తమ పార్టీ వాళ్లు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇవన్నీ రాజకీయ కక్షలే అని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం వీటిపై విచారణ జరపకుండా వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి తమమీదకు రుద్దుతూ… డెవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ వర్షన్‌. ఇదే అంశంపై కూటమి సర్కార్‌కు, వైసీపీకి మధ్య వార్ ముదురుతోంది. కూటమి నేతలు వాగ్దానాలు నిలబెట్టుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. కొద్ది రోజులగా ఎక్కడ ఏం జరిగినా.. కనీసం వివరణ కూడా తీసుకోకుండా పూర్తి అవాస్తవాలనే ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పుంగనూరులో జరిగింది ప్రతీకార దాడులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు మిథున్‌రెడ్డి.

ప్రతిపక్ష నేతలపై పెడుతున్న కేసులపై ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎలాంటి కేసులు ఎదుర్కోటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే తప్పు చెయ్యకపోయినా కక్షకట్టి రాజకీయం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. చట్ట ప్రకారం కాకుండా కక్ష సాధింపులకు పాల్పడితే ఇదే రోజు మళ్లీ వస్తుందని, కూటమి నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎక్కడ చిత్తు కాగితాలు తగలబడినా ప్రభుత్వ ఫైల్స్ దగ్ధమయ్యాయని ప్రచారం చేస్తూ.. ఉద్యోగులను కూడా సస్పెండ్ చేసి వేధిస్తున్నారని మాజీ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆరోపణలు, తప్పుడు ప్రచారానికి పరిమితమవుతున్న తీరు చూస్తే ప్రభుత్వం ఫెయిలైనట్టు కనిపిస్తోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ఇలా వైసీపీ నేతలంతా వన్‌ బై వన్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికే డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడుపుతున్నారని వైసీపీ ప్రధాన ఆరోపణ చేస్తోంది. ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలు కొట్టేస్తోంది. ఏపీలో కక్షలూ లేవు.. ప్రతీకారాలు లేవన్నారు హోమంత్రి అనిత. ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్న ఆరోపణలుకు గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపారు మంత్రి అనిత. ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏపీలో ఏం జరిగినా రాజకీయమే అవుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీలో వేడెక్కిన రాజకీయ రంగస్థలం.. టీడీపీ, వైసీపీల మధ్య
ఏపీలో వేడెక్కిన రాజకీయ రంగస్థలం.. టీడీపీ, వైసీపీల మధ్య
విగ్రహాల చుట్టూ తిరుగుతోన్న తెలంగాణ రాజకీయం.. తాజాగా తెరపైకి..
విగ్రహాల చుట్టూ తిరుగుతోన్న తెలంగాణ రాజకీయం.. తాజాగా తెరపైకి..
చిరంజీవి పుట్టినరోజు నేడు.. తెలుగు సినీ ప్రియులకు పండగరోజు..
చిరంజీవి పుట్టినరోజు నేడు.. తెలుగు సినీ ప్రియులకు పండగరోజు..
నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు..18కి చేరిన మృతుల సంఖ్య
నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు..18కి చేరిన మృతుల సంఖ్య
ఓటీటీలోకి వచ్చేసిన ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి.. ఎందులోనంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి.. ఎందులోనంటే?
అచ్యుతాపురం దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు..
అచ్యుతాపురం దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు..
పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి
పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి
రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై సీఎం కీలక నిర్ణయం.. అధికారులకు ఆదేశం
రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై సీఎం కీలక నిర్ణయం.. అధికారులకు ఆదేశం
AP 10th Class-2025 పబ్లిక్‌పరీక్షల మోడల్‌ క్వశ్చన్‌పేపర్లు విడుదల
AP 10th Class-2025 పబ్లిక్‌పరీక్షల మోడల్‌ క్వశ్చన్‌పేపర్లు విడుదల
మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే.?
మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే.?
పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి
పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి
ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన.. నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. వీడియో
ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన.. నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. వీడియో
ఈ వారం చికెన్‌ ధరలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు.! మరీ ఇంత తక్కువ.?
ఈ వారం చికెన్‌ ధరలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు.! మరీ ఇంత తక్కువ.?
బ్యాడ్ న్యూస్.. ఆసుపత్రిలో హీరో మోహన్ లాల్‌.! ఎందుకంటే.?
బ్యాడ్ న్యూస్.. ఆసుపత్రిలో హీరో మోహన్ లాల్‌.! ఎందుకంటే.?
యువరైతు వినూత్న ఆవిష్కరణ! పంటలకు కాపలా కాసేందుకు సెన్సార్‌ యంత్రం
యువరైతు వినూత్న ఆవిష్కరణ! పంటలకు కాపలా కాసేందుకు సెన్సార్‌ యంత్రం
ప్రయాణికులతో వెళ్తుండగా.. రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు.!
ప్రయాణికులతో వెళ్తుండగా.. రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు.!
వైద్యుల నిరసనల వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు.!
వైద్యుల నిరసనల వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు.!
వాట్సాప్‌ కాల్స్‌తో వణికిపోతున్న జనం.. ఎందుకో తెలుసా.?
వాట్సాప్‌ కాల్స్‌తో వణికిపోతున్న జనం.. ఎందుకో తెలుసా.?
నీతా అంబానీ తాగే వాటర్‌ ధర రూ.27 వేలా.? అసలు స్టోరీ ఏంటి.?
నీతా అంబానీ తాగే వాటర్‌ ధర రూ.27 వేలా.? అసలు స్టోరీ ఏంటి.?
మాదాపూర్‌లో బోర్డ్‌ తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ.!
మాదాపూర్‌లో బోర్డ్‌ తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ.!