AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివేకా హత్య కేసు: డ్రైవర్ ప్రసాద్ తల్లి స్పందన

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసుల వద్ద ఉన్న లెటర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. తొందరగా రమ్మన్నందుకు డ్రైవర్ తనను చావకొట్టినాడని రాసి ఉంది. దీంతో డ్రైవర్‌పై అందరి దృష్టిపడింది. అయితే తన బిడ్డ హత్య చేసేంత కిరాతకుడు కాదని, వివేకా వద్ద చాలా నమ్మకంగా పనిచేసేవాడని డ్రైవర్ ప్రసాద్ తల్లి అంటోంది. శుక్రవారం ఫోన్ చేసి సార్ చనిపోయాడమ్మా అంటూ వివేకానందరెడ్డి మరణవార్త చెప్పి ఫోన్ పెట్టేశాడని, ఆ తర్వాత తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా […]

వివేకా హత్య కేసు: డ్రైవర్ ప్రసాద్ తల్లి స్పందన
Vijay K
|

Updated on: Mar 16, 2019 | 9:09 PM

Share

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసుల వద్ద ఉన్న లెటర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. తొందరగా రమ్మన్నందుకు డ్రైవర్ తనను చావకొట్టినాడని రాసి ఉంది. దీంతో డ్రైవర్‌పై అందరి దృష్టిపడింది. అయితే తన బిడ్డ హత్య చేసేంత కిరాతకుడు కాదని, వివేకా వద్ద చాలా నమ్మకంగా పనిచేసేవాడని డ్రైవర్ ప్రసాద్ తల్లి అంటోంది.

శుక్రవారం ఫోన్ చేసి సార్ చనిపోయాడమ్మా అంటూ వివేకానందరెడ్డి మరణవార్త చెప్పి ఫోన్ పెట్టేశాడని, ఆ తర్వాత తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదని తెలిపింది. తన బిడ్డ ఎక్కడున్నాడో చెప్పాలని, వెంటనే వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేసింది. డ్రైవర్ ప్రసాద్ భార్య కృప తన భర్తకు హత్య చేసేంత ధైర్యంలేదని, వివేకానందరెడ్డిని కొట్టి చంపేంత దుర్మార్గుడు కాదని చెప్పింది.