Andhra News: టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
రాబోయే నెల రోజుల్లో విశాఖలోని అందాలను చేసేందుకు వెళ్లే పర్యాటకు ఇదో గుడ్న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుంకటే తొమ్మిది రోజులపాటు విశాఖ తీరంలో టూరిస్టుల పండుగకు ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 23 నుండి 31 వరకు విశాఖ ఉత్సవ్ పేరుతో బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా స్టార్ట్ అయ్యాయి.

రాబోయే వారం రోజుల్లో విశాఖలోని అందాలను చేసేందుకు వెళ్లే పర్యాటకు ఇదో గుడ్న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుంకటే తొమ్మిది రోజులపాటు విశాఖ తీరంలో టూరిస్టుల పండుగకు ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 23 నుండి 31 వరకు విశాఖ ఉత్సవ్ పేరుతో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలైనట్టు తెలిపారు. వచ్చే ఏడాది ఫస్ట్ మంత్ ఎండింగ్లో తొమ్మిది రోజులపాటు నాన్ స్టాప్ ఫెస్టివల్ ఏర్పాట్లు చేస్తున్నారని. పర్యాటకులకు సరికొత్త అనుభూతి కల్పించేలా ఎంటర్టైన్మెంట్, ఫుడ్ తో పాటు దేశ విదేశీ టూరిస్టులకు ఆకట్టుకునేలా బీచ్ ఫెస్టివల్ కు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆయన అన్నారు.
శుక్రవారం విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై విశాఖలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తొలి సమీక్ష సమావేశంలో విశాఖ ఉత్సవ్ – బీచ్ ఫెస్టివల్ పోస్టర్ను సీఎం చేతుల మీదుగా మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరింప చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర పర్యాటక రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కార్యక్రమం ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపారు. ఈ క్రమంలో విశాఖను అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ సందర్భంగా విశాఖ ఉత్సవ్ ను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. త్వరలోనే స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిపి విశాఖ ఉత్సవ్ పై కమిటీ ఏర్పాటు చేసి మీటింగ్ నిర్వహించి దిశా నిర్దేశం చేస్తామన్నారు.
బీచ్ ఫెస్టివల్ ను ఒక పెద్ద ఈవెంట్ గా నిర్వహించి పర్యాటక రంగానికి మరింత ప్రాచుర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు మంత్రి దుర్గేష్. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వంలో పర్యాటక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




